Home » బాలకృష్ణ సినిమాకు నిర్మాతల ఇబ్బంది..?

బాలకృష్ణ సినిమాకు నిర్మాతల ఇబ్బంది..?

by Azhar
Ad
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఇప్పుడు మంచి స్పీడ్ లో ఉన్న హీరో ఎవరు అంటే అది నందమూరి నటసింహం బాలకృష్ణ. అయితే బాలయ్య చివరిగా విడుదల చేసిన అఖండ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అందువల్ల అదే జోష్ లో ఇప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తానా సినిమా అనేది చేస్తున్నాడు. అయితే ఈ సినిమా అనేది జులై నెలలోనే పూర్తి కావాలి. కానీ బాలయ్య ఆరోగ్య పరిస్థుతుల కారణంగా ఈ ఆగస్టులో పూర్తి అవుతుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో తన సినిమా చేయబోతున్నాడు.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. కానీ ఈ సినిమాకు ఇప్పుడు నిర్మాతల ఇబ్బంది అనేది వచ్చినట్లు తెలుస్తుంది. మాములుగా ఓ హీరో, డైరెక్టర్ కలిసి సినిమాను ప్రకటించినప్పుడే దాని నిర్మాత ఎవరు అనేది తెలుస్తుంది. కానీ ఈ సినిమాకు మాత్రం ఎవరు ప్రొడ్యూసర్ అనేది ఇంకా తెలియడం లేదు. అయితే మొదట ఈ సినిమాను బాలయ్య తానే నిర్మాతగా తెరకేక్కిన్చానున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు బాలయ్య ఆయా నిర్ణయం నుండి వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. అంతేగాక ఇప్పటికే ఈ సినిమా కథను దిల్ రాజుకు చెప్పాడట అనిల్ రావిపూడి.
అయితే మొదట ఈ సినిమాను నిర్మించేందుకు ఒప్పుకున్నా దిల్ రాజు.. ఈ మధ్య ఎఫ్3తో పాటు వరుసగా తన సినిమాలు అనేవి ప్లాప్స్ కావడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా బాలయ్యతో ఇప్పుడు సినిమా చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా కథ విని.. నో చెప్పినట్లు తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు అనిల్ రావిపూడి కథ చెప్పి ఓ నిర్మాతను ఒప్పించే పనిలో పడినట్లు తెలుస్తుంది. కానీ తమ అభిమాన హీరో సినిమా అనేది ఎప్పుడు మొదలవుతుంది అని బాలయ్య ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ బాలయ్య – అనిల్ రావిపూడి కాంబోకు ఎవరు ప్రొడ్యూసర్ గా రానున్నారు అనేది.

Advertisement

Visitors Are Also Reading