Home » ఎంత ఖ‌ర్చైనా భ‌రిస్తాను నాకు వైద్యం అందించండి…శ్రీలంక అధ్య‌క్షుడికి నిత్యానంద లేఖ‌..!

ఎంత ఖ‌ర్చైనా భ‌రిస్తాను నాకు వైద్యం అందించండి…శ్రీలంక అధ్య‌క్షుడికి నిత్యానంద లేఖ‌..!

by AJAY
Ad

స్వామి నిత్యానంద ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. దొంగ‌బాబాగా స్వామి నిత్యానందకు ఎంతో పేరు ఉంది. అంతే కాకుండా స్వామి నిత్యానంద త‌న‌ను తానే దేవుడిగా చెప్పుకుంటూ ఫేమ‌స్ అయ్యాడు. నిత్యానంద ఒక‌ప్పుడు కోలీవుడ్ యాంక‌ర్ తో రాస‌లీలు సాగిస్తున్న వీడియో నెటింట వైర‌ల్ గా మారింది. దాంతో నిత్యానంద భ‌క్తుల సంఖ్య కొద్దిగా త‌గ్గిపోయింది. కానీ ఇప్ప‌టికీ నిత్యానంద ను దేవుడిగా ఆరాధించే భ‌క్తులు ఉన్నారు.

Advertisement

ఇక నిత్యానంద ఇండియా వ‌దిలి వెళ్లి శ్రీలంక లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాన‌ని చెప్పారు. ఆ రాజ్యానికి తానే అధిప‌తి అని తానే దేవుడు అని ప్ర‌చారం చేసుకున్నారు. అంతే కాకుండా త‌న కైలాస రాజ్యంలో ప్రవేశించాలంటే భారీగా డ‌బ్బులు చెల్లించాల‌ని కూడా నిత్యానంద డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా నిత్యానంద గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

దాంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నిత్యానంద తాజాగా శ్రీలంక దేశ అధ్య‌క్షుడికి లేఖ రాశార‌ని స‌మాచారం. ఆ లేఖ‌లో నిత్యానంద త‌న‌ను కాపాడాల‌ని పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది. త‌న ఆరోగ్యం క్షీణిచింద‌ని త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని నిత్యానంద పేర్కొన్నారు.

అంతే కాకుండా కైలాసరాజ్యంలో మెరుగైన వైద్యం లేద‌ని త‌న‌కు మెరుగైన వైద్యం అందిచాల‌ని కోరారు. అంతే కాకుండా ఎంత ఖ‌ర్చు అయినా తానే భ‌రిస్తాన‌ని నిత్యానంద శ్రీలంక నూత‌న అధ్య‌క్షుడు ర‌ణిల్ విక్ర‌మ్ సింఘెకి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శ్రీలంక సంక్షోభంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. దాంతో శ్రీలంక‌నే అడుక్కుతినే ప‌రిస్థితిలో ఉంటే నీకు ఎక్క‌డ నుండి వైద్యం అందిస్తుందంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Visitors Are Also Reading