Home » తల్లి అయిన నిత్యామీనన్.. చేతిలో పసిబిడ్డతో ప్రత్యక్షం !

తల్లి అయిన నిత్యామీనన్.. చేతిలో పసిబిడ్డతో ప్రత్యక్షం !

by Bunty
Ad

నిత్యమీనన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అది తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో నిత్యమీనన్ కూడా ఒకరు. ఒకప్పుడు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న నిత్యామీనన్ ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలను చేస్తోంది. నిత్యామీనన్ పారితోషకం కంటే తాను ఎంచుకునే పాత్రలకే ప్రాధాన్యత ఉండాలని చూస్తూ ఉంటుంది.

Advertisement

నిత్యమీనన్ కి సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉండగా తాజాగా నిత్యామీనన్ తన సింప్లిసిటీని చాటుకున్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కాంభాగం గిరిజన కాలనీలో గిరిజన ప్రజలతో కాసేపు సమయాన్ని గడిపారు. అక్కడ ఓ బిడ్డని ఎత్తుకొని లాలించారు. గిరిజన పిల్లలు పాట పాడుతుంటే ఆ బిడ్డను తన చేతుల్లో ఎత్తుకొని ఆడించారు.

Advertisement

కాంభాగం గిరిజన కాలనీ ఆలయాన్ని సందర్శించారు. గిరిజనుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వరదయ్యపాలెం మండలంలోని బత్తలవల్లం గ్రామంలో గల కల్కి ఆశ్రమాన్ని సినీనటి సందర్శించారు. వారం రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నట్లు తెలుస్తోంది. సామాన్యులతో మమేకమవుతూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు, ఓ చిన్నారిని ఎత్తుకొని మరి ఫోటోలు దిగారు నిత్య. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు, నిత్యామీనన్ తల్లి అయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

READ ALSO : WhatsApp : వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్‌.. డిసెంబర్‌ 31 నుంచి ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదు !

Visitors Are Also Reading