Home » నయనతార ఆడపడుచు కట్నం ఎంత ఇచ్చిందో తెలుసా..?

నయనతార ఆడపడుచు కట్నం ఎంత ఇచ్చిందో తెలుసా..?

by Azhar
Ad

కోలీవుడ్ ప్రేమ జంట దర్శకుడు విగ్నేష్ , హీరోయిన్ నయనతార పెళ్లితో ఒక్కటైనా విషయం అందరికి తెలిసిందే. దాదాపు ఐదేళ్లుగా ఈ జంట బహిరంగంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చింది. దాంతో వీరి పెళ్లి పైన చాలానే రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ కరోనా సమయంలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అన్నారు. కానీ అలా జరగలేదు. కరోనా కాలం ముగిసిన తర్వాత ఈ నెల 9న విగ్నేష్ – నయనతారల పెళ్లి కుటుంభం సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి సినిమా ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వారు చాలా మంది వచ్చారు.

Advertisement

అయితే ఈ పెళ్లి సందర్భంగా విగ్నేష్ , నయనతార ఒక్కొక్కరికి ఇచ్చుకున్న బహుమతుల విషయం చాలా వైరల్ ఐన విషయం తెలిసిందే. నయనతార విగ్నేష్ కు ఓ కొత్త బంగ్లా బహుమతిగా ఇచ్చిందట. దీని విలువ 20 కోట్లు అని అంటున్నారు. అలాగే విగ్నేష్ కూడా ఆడవాళ్లకు సహాంజంగానే ఇష్టం అయిన బంగారు నగలను నయనతారకు బహుకరించాడట. వీటి విలువ ఎంత లేదన్న 5 కోట్లు ఉంటుందని సమాచారం. కానీ ఇప్పుడు ఈ పెళ్ళిలో ఇచ్చిన మరో కట్నం విషయం వైరల్ గా మారుతుంది.

Advertisement

అయితే విగ్నేష్ కు ఓ చెల్లెల్లు ఉంది. మన ఇండియాలో పెళ్లికి ముందు అబ్బాయికి అక్క గని చెల్లెలు గని ఉంటె ఆడపడుచు కట్నం ఇవ్వడం అనేది ఆచారం అనేది అందరికి తెలిసిందే. దీనిని అందరూ పాటిస్తుంటారు కూడా. ఇక నయనతార కూడా దీనిని పాటించింది. ఆమె విగ్నేష్ చెల్లెలుకు 15 లక్షలు విలువ చేసే నగలను ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక నయన్ ఇచ్చిన ఆడపడుచు కట్నం గురించి తెలిసిన తర్వాత అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు అనేది నిజం.

ఇవి కూడా చదవండి :

ఈపీఎల్ కంటే మన ఐపీఎల్ బెస్ట్ అంటున్న గంగూలీ..!

మ్యాచ్ కు 100 కోట్లు… ఐపీఎల్ మీడియా రైట్స్ దూకుడు..!

Visitors Are Also Reading