Home » నయనతార ను ఖచ్చితంగా కొడతా…వైరల్ అవుతున్న ప్రభుదేవా భార్య కామెంట్స్..!

నయనతార ను ఖచ్చితంగా కొడతా…వైరల్ అవుతున్న ప్రభుదేవా భార్య కామెంట్స్..!

by Sravanthi Pandrala Pandrala

తెలుగు తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార, విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది.ఈ సందర్భంలోనే ఆమె పాత ప్రేమ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజ్ఞేశ్ శివన్ కంటే ముందు నయనతార ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ప్రభుదేవాకు అప్పటికే మ్యారేజ్ అయినా కానీ నయనతార ఆయనతో ప్రేమలో పడింది. మరి వీరి ప్రేమ విషయం పై ప్రభుదేవా భార్య ఏ విధంగా రియాక్ట్ అయ్యిందో ఓ సారి తెలుసుకుందాం..? ప్రభుదేవా రమాలత్ అనే ఒక ముస్లిం అమ్మాయి ని వివాహం చేసుకున్నారు. ప్రభుదేవా కోసం మతం మార్చుకుని హిందూ మతం లోకి వచ్చింది.వారి వివాహ బంధం 15 సంవత్సరాలుగా చాలా హ్యాపీగా కొనసాగుతూ వస్తోంది. ఇంతలో వీరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ సమయంలోనే ప్రభుదేవా కుమారుడు కూడా మృతి చెందాడు. దీంతో గొడవలు తీవ్రమై పోయాయి. ఇక నయనతారను పెళ్లి చేసుకోవాలని ప్రభుదేవా డిసైడ్ అయిపోయారు. వెంటనే 2011లో రమాలత్ కు విడాకులు కూడా ఇచ్చేశారు. ఆ సమయంలో ఆమెకు భారీగా ఆస్తులు కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ నయనతార ప్రభుదేవా కూడా విడిపోయారు. అయినా ప్రభుదేవా భార్య నయనతార పై ఘాటు కామెంట్ లు చేస్తూనే వస్తోంది. నయనతార వల్లనే నా కాపురం కూలిపోయిందని, నా బ్రతుకు రోడ్డున పడింది అని, నా భర్తను నాకు దూరం చేసిన నయనతారను దేవుడు కూడా క్షమించడు అని ఆవేదన చెందింది. పెళ్లైన మగాళ్ల వైపు చూసే ఆడవాళ్లను కఠినంగా శిక్షించాలని, నయనతారను ఖచ్చితంగా కొడతానని, ఆమె అన్నారు. నా జీవితంలో చిచ్చుపెట్టిన ఆమె కచ్చితంగా అంతకంతకు అనుభవిస్తుందని అన్నది. 15 సంవత్సరాలు నా భర్త నన్ను దేవతలా చూసుకున్నారని, ఇల్లు మరియు పని తప్ప మరోటి తెలియని ఆయనను నయనతార ఏం మాయ చేసిందో అంటూ మండిపడింది. గురువారం నయనతార పెళ్లి జరుగుతున్న తరుణంలో ప్రభుదేవా-నయనతార మధ్య ప్రేమాయణం జరిగిన విషయం, నయనతారను ప్రభుదేవా భార్య ఏ విధంగా తిట్టిందో అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ALSO READ;

నయనతార విగ్నేష్ శివన్ ల పెళ్లి పత్రిక చూస్తే ఫిదా అవుతారు..?

ఆ షో చేస్తుండగా హైపర్ ఆది ని మధ్యలోనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

 

Visitors Are Also Reading