Home » కవలలు పుట్టిన ఆనందం ఎంతోసేపు లేదు..! నాయన తార విగ్నేష్ జంటకి షాక్ !

కవలలు పుట్టిన ఆనందం ఎంతోసేపు లేదు..! నాయన తార విగ్నేష్ జంటకి షాక్ !

by AJAY
Ad

సరోగసి అంటే ఒకప్పుడు ఎవరికీ పెద్ద‌గా తెలియదు గానీ ఇప్పుడు సరోగసి అంటే చాలామందికి తెలిసిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల వల్ల సరోగసి అనే పదం ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. దానికి కార‌ణం చాలామంది సెలబ్రిటీలు సరోగసి ద్వారా పిల్లలను కన‌డ‌మే. టాలీవుడ్ లో మంచు లక్ష్మి ఈ స‌రోగ‌సి విధానం ద్వారానే తన కూతురుకు జన్మ‌నిచ్చింది. అంతేకాకుండా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార సరోగసి పద్ధతి ద్వారా ఇద్ద‌రు మ‌గ పిల్ల‌ల‌కు జన్మనిచ్చింది. నయనతార నాలుగు నెలల క్రితం దర్శకుడు విగ్నేష్ శివ‌న్ ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీళ్లిద్ద‌రూ గ‌త కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇక‌ ఎట్టకేలకు జూన్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అయితే వీరి వివాహం జరిగి కేవలం నాలుగు నెలలు అవుతుంది.

Advertisement

కానీ స‌రోగ‌సి పద్ధతి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విగ్నేష్ శివ‌న్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా ఇప్పుడు నయనతార సరోగసి ద్వారా పిల్లలను కనడం వివాదానికి దారి తీసింది. నిజానికి సరోగసి పద్ధతి ద్వారా బిడ్డలకు జన్మనిచ్చే హక్కు ఉంది. కానీ దానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.

పెళ్లి చేసుకుని కాపురం చేసిన తర్వాత ఏదైనా లోపం వల్ల లేదంటే అనారోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టనట్లయితే అప్పుడు మాత్రమే స‌రోగ‌సి ద్వారా పిల్లలను క‌నే హ‌క్కు ఉంటుంది. కానీ నయనతార పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే బిడ్డలకు జన్మనిచ్చింది. అంటే పెళ్లికి ముందే పిల్లలు కనేందుకు ప్లాన్ చేసుకున్నారు. కాబట్టి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తమిళనాడు ఆరోగ్యశాఖ‌ మంత్రి ఈ విషయంపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. దాంతో బిడ్డలకు జన్మనిచ్చిన ఆనందం లేకుండానే నయనతార చిక్కుల్లో పడిపోయింది.

Visitors Are Also Reading