Home » మూడో భార్యతో ప్రాణహాని ఉందంటూ నరేష్ సంచలన ఆరోపణలు..ట్విస్ట్ ఏంటంటే..?

మూడో భార్యతో ప్రాణహాని ఉందంటూ నరేష్ సంచలన ఆరోపణలు..ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కొన్ని నెలల నుంచి నరేష్ మరియు పవిత్ర లోకేష్ మధ్య ఏదో జరుగుతుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఈ వార్తలు మరి ఎక్కువైపోయాయి. ఓవైపు సోషల్ మీడియా మరోవైపు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఒక్కసారిగా తెరమీదకు వచ్చారు. నరేష్ పై షాకింగ్ విషయాలు బయట పెట్టారు. దీనికి చాలా ఘాటుగా స్పందించారు నరేష్. తన మూడో భార్య రమ్య మీద ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టారు. ఆమెకు డ్రైవర్ తో సంబంధం ఉందని, అదే విధంగా బెంగళూరులో కూడా మోసాలు చేయడానికి వచ్చిందని ఆరోపించారు. అక్కడ ప్రజలను అలర్ట్ చేయడానికి నేను కర్ణాటక వెళ్లానని తెలియజేశారు.హైదరాబాద్లో ఉన్నప్పుడు రమ్య చేసిన అప్పులను నేనే కట్టాలని, కృష్ణగారి వద్దకు వచ్చి చాలామంది గొడవ చేశారని, ఆమె జైలు కి వెళ్తాను అంటే స్వయంగా 10 లక్షలు ఇచ్చానని అన్నారు. రమ్య ఇప్పుడు నా పైన ఆరోపణలు చేస్తుందని, నేను మగాడ్ని నాకు కొన్ని అవసరాలు కూడా ఉంటాయి. నాకు ఎమోషనల్ సపోర్ట్ కావాల్సిన టైం లో పవిత్ర లోకేష్ పరిచయం అయిందని అన్నారు. నా కష్టాలు అర్థం చేసుకుని నాతో ప్రయాణం చేస్తోందని, నా ఫ్యామిలీతో కలిసి ఉంటుందని ఆయన అన్నారు.నా జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని ప్రశ్నించారు. నా ఫ్యామిలీ లో జరిగినటువంటి ఫంక్షన్లకు దూరంగా ఉన్నావు. నీవు ఎవరితో ఉంటున్నావ్.. అనే విషయాల గురించి నేను మాట్లాడను. నీకు సంబంధించిన వారితో నీ రిలేషన్ లో నువ్వు ఉంటున్నావు. నీ గురించి నేను చెడుగా మాట్లాడను కానీ పవిత్ర లోకేష్ మూడు నాలుగేళ్ల క్రితం నా జీవితంలోకి వచ్చిందని, నువ్వు ఎనిమిది సంవత్సరాల క్రితమే వెళ్ళి పోయావని అన్నారు. రమ్య కుటుంబ సభ్యులు ఆయనకు డబ్బులు ఇవ్వవద్దని హెచ్చరించారని చెప్పుకొచ్చారు నరేష్. రమ్య యొక్క మానసిక పరిస్థితి బాగాలేదని, ఆమెను మంచి సైకియాట్రిస్ట్ కి చూపించమని చెప్పారు. రమ్య మాట్లాడుతున్న మాటల్లో నిజం లేదని, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలని చూస్తుందని, నన్ను టార్చర్ పెడుతున్నారు అని నరేష్ అన్నారు. జర్నలిజం చేసి ఏదో కంపెనీలు పెట్టింది. తను ఎమ్మెల్యే కావాలనే కోరికతో ఎలాగైనా డబ్బు సంపాదించే పనిలో పడింది. ఆమె ప్రమేయం వల్ల నాకు ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నేను డైవర్స్ కోసం అప్లై చేశాను అని అన్నారు. నేను పవిత్ర లోకేష్ తో ఉండడం కోసం రమ్యకు డైవర్స్ ఇవ్వడం లేదని తెలియజేశారు.

Advertisement

ALSO READ;

Advertisement

పెళ్లి త‌రువాత సంతోషంగా ఉండ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన స‌మంత‌..!

ఒకే తరహా కథలతో, ఒకే రోజు విడుదలై.. హిట్ కొట్టిన స్టార్ హీరోల సినిమాలు.. ఇవేనా..?

 

Visitors Are Also Reading