Home » న‌రేష్ ప‌విత్ర‌ల పెళ్లి పై ఫుల్ క్లారిటీ..దీని కోసమే అంతపని చేశారా…?

న‌రేష్ ప‌విత్ర‌ల పెళ్లి పై ఫుల్ క్లారిటీ..దీని కోసమే అంతపని చేశారా…?

by AJAY
Ad

టాలీవుడ్ న‌టుడు న‌రేష్ ప‌విత్ర పెళ్లి చేసుకున్నారంటూ పెళ్లి ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. న‌రేష్ ప‌విత్ర‌లు కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. నరేష్ త‌న మూడో భార్య‌తో విడిపోయిన త‌ర‌వాత ప‌విత్ర‌తో డేటింగ్ లో ఉన్నాడు. ప‌విత్ర కూడా త‌న భ‌ర్త‌తో దూరంగా ఉంటోంది. అంతే కాకుండా పవిత్ర‌కు ఇద్ద‌రు సంతానం కూడా ఉన్నారు.

ALSO READ : ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..? జ‌క్క‌న్న ఎలా మిస్ అయ్యాడ‌బ్బా..!

Advertisement

ఇక ప్ర‌స్తుతం ప‌విత్ర న‌రేష్ డేటింగ్ లో ఉండ‌టం..పెళ్లి ఫోటోలు వైర‌ల్ అవ్వ‌డంతో అంతా నిజంగానే పెళ్లి చేసుకున్నార‌ని దుబాయ్ లో హ‌నిమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నార‌ని క‌థనాలు చ‌క్కర్లు కొట్టాయి. కాగా ఇప్పుడు వీరి పెళ్లి వార్త‌ల‌పై ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది. న‌రేష్ ప‌విత్ర‌లోకేష్ క‌లిసి ఓ మ‌త్తెమ‌దువై అనే సినిమాలో నటించారు.

Advertisement

ఈ సినిమా కోస‌మే పెళ్లి సీన్ లో న‌టింగా దానికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను న‌రేష్ విడుద‌ల చేశారు. అంతే కాకుండా ఈ సినిమాను విజ‌య్ కృష్ణ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ లుగా న‌రేష్ ప‌విత్ర‌లు న‌టిస్తున్నారు.

 

అదే విధంగా ఈ సినిమాకు ఎంఎస్ రాజు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను న‌రేష్ సొంతంగా నిర్మిస్తున్నారు. ఇక రియ‌ల్ లైఫ్ లో ప్రేమ‌లో మునిగితేలుతున్న ఈ జంట క‌లిసి సినిమాలో న‌టించ‌డం టాలీవులో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈ సినిమాకు ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఉండ‌టం విశేషం.

ALSO READ : Manchu Manoj-Manchu Vishnu : మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి.. వీడియో షేర్ చేసిన హీరో

Visitors Are Also Reading