Home » మరో వివాదంలో బాలయ్య… దానమ్మ నర్సులంటూ !

మరో వివాదంలో బాలయ్య… దానమ్మ నర్సులంటూ !

by Bunty
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా కోట్లు వసూలు చేస్తోంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా, శృతిహాసన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా మలయాళ నటి హనీ రోజ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఇటీవల నిర్వహించారు. అయితే సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ సంచలన వాక్యాలు చేశారు.

Advertisement

అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. దీనిపై ఇంకా వివాదమే నడుస్తోంది. ఈ గాయం మానక ముందే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నాడు. అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో సినీ నటుడు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నర్సులపై చేసిన వాక్యాలు వెనక్కి తీసుకుని, నర్సులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంలో జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ చేసిన వాక్యాలు అభ్యంతర కరంగా ఉన్నాయని తెలిపారు. బాలకృష్ణ గతంలోనూ తనకు వైద్య సేవలు అందించిన ఒక నర్సుపై అనుచిత వాక్యాలు చేశారని పేర్కొన్నారు. నర్సులపై చేసిన వాక్యాలకు బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ గా మారింది.

Advertisement

అసలు వివాదం ఏంటి : 

ఆహా షోలో భాగంగా, పవన్-బాలకృష్ణ మధ్య నటుడు సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్భంగా బాలకృష్ణ గతంలో ఒకసారి తనకు జరిగిన యాక్సిడెంట్ ఉదంతాన్ని పవన్ కళ్యాణ్ కు వివరించే ప్రయత్నం చేశారు. కాలేజీ రోజుల్లో తాను కూడా బైకులపై ఎక్కువగా తిరిగే వాడినని, ఒకసారి రోడ్డు క్రాస్ చేస్తుండగా మరో బైకు వేగంగా వచ్చి కొట్టేసిందన్నారు. దాంతో తాను ఎగిరి పడ్డానని, ఒళ్లంతా రక్తమేనని వివరించారు. తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని, అక్కడ యాక్సిడెంట్ అని చెప్పొద్దు, కాలుజారి కింద పడ్డ అని చెప్పాల్సిందిగా స్నేహితులు సలహా ఇచ్చారన్నారు. ఆ సమయంలో చికిత్స చేయడానికి వచ్చిన ఒక నర్సు ను ఉద్దేశించి “దానెమ్మ, ఆ నర్సు ఏమో భలే అందంగా ఉంది ముఖం క్లీన్ చేస్తూ ఏమైంది? అంది. నేనేమో యాక్సిడెంట్ అయిందని చెప్పేసా, గెట్ ఔట్ అనేసారు” అంటూ బాలకృష్ణ మాట్లాడారు. ఆ వాక్యాలు ఇప్పుడు వివాదంగా మారాయి.

READ ALSO : కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు జరిగాయి… ఇదే సాక్ష్యం!

Visitors Are Also Reading