Home » రెండు ఇడ్లులకు రూ.90, మిర్చీ బజ్జీలకు రూ.125…నమ్రత రెస్టారెంట్ మెనూ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…!

రెండు ఇడ్లులకు రూ.90, మిర్చీ బజ్జీలకు రూ.125…నమ్రత రెస్టారెంట్ మెనూ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి స్థాపించిన ఏఎంబి థియేటర్ హైదరాబాద్ లోనే నంబర్ వన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి తన భార్య నమ్రత పేరిట రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. ఏఎన్ రెస్టారెంట్ పేరుతో గ్రాండ్ గా ఓపెన్ చేశారు.

Advertisement

ఇక ఈ రెస్టారెంట్ లో ఏఎంబి థియేటర్ మాదిరిగానే ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మొదట అభిమానులు.. నెటిజన్స్ మహేష్ బాబు రెస్టారెంట్ లో ఏదో ఒకటి తినాలని అనుకున్నారు. కానీ ఫుడ్ మెనూ చూస్తే మాత్రం కళ్ళు బయర్లు కావాల్సిందే. స్నాక్స్ ఐటమ్స్ కు సైతం ధరలు వందల్లో ఉండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement

అంతే కాకుండా మెనూ ప్రకారం కేవలం రెండు ఇడ్లీలకు తో రూ.90 గా ఉంది. అదేవిధంగా మిరపకాయ బజ్జీలు ఒక్కప్లేట్ ధర రూ.125 గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక కప్ టీ రూపాయలు 80 గా ఉంది. అయితే సాధారణంగా బయట నాలుగు ఇడ్లీల ధర రూ.30 ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీ అయితే కేవలం 10 రూపాయలు మాత్రమే… కానీ నమ్రత రెస్టారెంట్ లో టీ ధర రూ.80 గా కనిపిస్తుంది.

అదేవిధంగా మిర్చి బజ్జి బయట 20 రూపాయలకు వస్తుంది. కానీ నమ్రత రెస్టారెంట్ లో రూ.80 గా కనిపిస్తోంది. దాంతో రెస్టారెంట్ లో అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నారు. అయితే రెస్టారెంట్ ధరలు మధ్యతరగతి వారికి ఇబ్బందిగా అనిపిస్తాయేమో కానీ సిటీలో ఉండే ధనవంతులు ఈ రెస్టారెంట్ కు క్యూ కడతారు.

Visitors Are Also Reading