టాలీవుడ్ అందాల తార సమంత… అక్కినేని వారసుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఏ మాయ చేసావే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే ఆ తర్వాత చాలా కాలానికి వీరిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. గోవాలో సమంత చైతూల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
Advertisement
హిందూ క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే చూడ్డానికి చిలకా గోరింకల్లా కనిపించిన ఈ జంట అన్యోన్యంగా కలిసి ఉంటారని అంతా భావించారు. కానీ అలా జరగకుండా పెళ్లైన కొన్నేళ్లకే తాము విడిపోతున్నామంటూ ప్రకటించి అందరిని షాక్ కు గురి చేశారు. మొదట విడాకుల వార్తలను సమంత నాగచైతన్య ఖండించినప్పటికీ ఆ తర్వాత వాళ్లే తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వీరిద్దరూ విడాకులు తీసుకుని ఏడాది అవుతుంది.
Advertisement
ఇక విడాకులకు అనేక కారణాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చెక్కలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే విడాకుల తర్వాత ఇద్దరు వారి వారి సినిమాలతో బిజీ అయ్యారు. అయితే సమంత చైతూలకు విడాకులు అవ్వడం వల్ల ఇప్పుడు నాగార్జునకు కష్టాలు వచ్చిపడినట్టు తెలుస్తోంది. పెళ్లి తర్వాత నాగచైతన్యకు సంబంధించిన ప్రతి విషయాన్ని సమంత దగ్గరుండి చూసుకునేవారట.
అంతే కాకుండా ఆర్థిక లావాదేవీలు…. సినిమా డేట్స్ సైతం సమంత చూసుకునేదట. ఇక సమంత చైతూకు విడాకులు ఇచ్చిన తర్వాత తన దారి తను చూసుకుంది. దాంతో ఇప్పుడు చైతూ డైట్, ఆర్థిక వ్యవహారాలు, సినిమా డేట్స్, కథల ఎంపిక బాధ్యతలను నాగార్జున చూసుకోవాల్సి వస్తుందట.