అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగచైతన్య. జోష్ సినిమాతో చైతూ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. రీసెంట్ గా చైతూ బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాలో కూడా చైతూ కీలకపాత్రలో నటిస్తున్నారు.
Advertisement
ఈ సినిమాతో చైతూ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అంతే కాకుండా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్ లలోనూ నాగచైతన్య నటిస్తున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య విడాకుల తరవాత మరింత బిజీగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చైతూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. షోయూ అనే పేరుతో నాగ చైతన్య హైదరాబాద్ లో ఓ రెస్టారెంట్ ను ప్రారంభించారు.
Advertisement
ఈ రెస్టారెంట్ లో ఆసియాలోని అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ను అందుబాటులో ఉంచారు. ఈ రెస్టారెంట్ కు సంబంధించి నాగచైతన్య ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే గతంలో కూడా అక్కినేని ఫ్యామిలీ రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. కానీ ఏవో కారణాల వల్ల ఆ రెస్టారెంట్ ను మూసివేశారు. ఇక ఇప్పుడు నాగచైతన్య కూడా రెస్టారెంట్ ను ప్రారంభించాడు. మరి సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి.