Home » టాలీవుడ్‌లో విషాదం.. మ‌రొక సీనియ‌ర్ న‌టుడు మృతి

టాలీవుడ్‌లో విషాదం.. మ‌రొక సీనియ‌ర్ న‌టుడు మృతి

by Anji
Ad

ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా చిత్ర ప‌రిశ్ర‌మకు చెందిన సీనియ‌ర్ న‌టులు, ప్ర‌ముఖులు మ‌ర‌ణిస్తుండ‌డం విషాదాన్ని క‌లిగిస్తోంది. ఇవాళ మ‌రొక సీనియ‌ర్ న‌టుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు దూర‌మ‌య్యాడు. ముత్యాల ముగ్గు ఫేమ్ పిసుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు (90) మృతి చెందారు. గ‌త కొద్ది రోజులుగా ఆసుప‌త్రిలోనే చికిత్స పొందుతూ ఈరోజు ఆయ‌న క‌న్నుమూసారు. రంగస్థ‌ల కళాకారుడిగా ప‌లు నాట‌కాల్లో న‌టించిన వెంక‌టేశ్వ‌ర‌రావు 1965లో సూప‌ర్ స్టార్ కృష్ణ‌హీరోగా న‌టించిన తేనేమ‌న‌సులు చిత్రంతో సినీరంగ ప్ర‌వేశం చేసారు. ఆ త‌రువాత ఏడాదిలోనే మ‌ళ్లీ కృష్ణ న‌టించిన క‌న్నె మ‌న‌సులు చిత్రంలో న‌టించారు.

Advertisement

Advertisement

1975లో లెజెండ్రీ డైరెక్ట‌ర్ బాపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ముత్యాల ముగ్గు చిత్రంలో పూజారి పాత్ర‌లో వెంక‌టేశ్వ‌ర‌రావు న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందారు. ఈ సినిమాతో ఆయ‌న ముత్యాల ముగ్గు వెంక‌టేశ్వ‌ర‌రావు గా మారిపోయారు. ముత్యాల ముగ్గుతో పాటు ఆత్మీయులు, మ‌ట్టిలో మాణిక్యం, సుడిగుండాలు లాంటి చిత్రాల్లో కూడా వెంక‌టేశ్వ‌ర‌రావు న‌టించారు. గ‌తంలో ఇదేమిటి అనే నాట‌కంలో న‌టించి ఉత్త‌మ హాస్య‌న‌టుడిగా అవార్డు అందుకున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీ. వీరికి ఏడుగురు మంది సంతానం క‌ల‌రు.

Visitors Are Also Reading