Home » టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు వివిధ కారణాలవల్ల మరణించారు. అయితే తాజాగా మరో విషాదం టాలీవుడ్ లో చోటుచేసుకుంది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మ్యూజిక్ డైరెక్టర్ రాజు ఇవాళ గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

Advertisement

దీంతో సినీ ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. హలో బ్రదర్, లంకేశ్వరుడు, యముడికి మొగుడు, బంగారు బుల్లోడు లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు రాజు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ దర్శకుడు రాజు మృతిపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. సంగీత దర్శకుడు రాజ్ మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది….ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో ‘రాజ్’ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి.

Advertisement

ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా కెరీర్ తొలి దశలలో నా చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన బాణీలు, నా చిత్రాల విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్నారు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

సమంత లాగే బరితెగించిన రష్మిక?

Rajamouli : ఆ హీరోతో ఈ జన్మలో సినిమా చేయను – రాజమౌళి

Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు

Visitors Are Also Reading