Home » ముంబై ఇండియ‌న్స్‌కు శుభ‌వార్త‌.. రాడ‌నుకున్న ఆర్చ‌ర్ వ‌చ్చేస్తున్నాడు..!

ముంబై ఇండియ‌న్స్‌కు శుభ‌వార్త‌.. రాడ‌నుకున్న ఆర్చ‌ర్ వ‌చ్చేస్తున్నాడు..!

by Anji
Published: Last Updated on

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్‌ను ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు రూ.8కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే తాను ఈ సీజ‌న్‌కు అందుబాటులో ఉండ‌ను అని అర్చ‌ర్ ముందే ప్ర‌క‌టించాడు. ఈ విష‌యం తెలిసిన ముంబైం ఇండియ‌న్స్ యాజ‌మాన్యం అత‌నిపై భారీ మొత్తం వెచ్చించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బుమ్రా-ఆర్చ‌ర్ కాంబోలో అద్భుతంగా ఉంటుంద‌ని అందుకే త‌మ‌కు న‌ష్టం వాటిల్లినా ఆర్చ‌ర్‌ను సొంతం చేసుకున్నాం అని ఫ్రాంచైజీ యాజ‌మాన్యం వివ‌ర‌ణ ఇచ్చింది.

ఇదిలా ఉండ‌గా.. ఈనెల 26 నుండి ఐపీఎల్ 15వ సీజ‌న్ ప్రారంభం కానున్న త‌రుణంలో ముంబై ఇండియ‌న్స్ అభిమానుల‌కు శుభవార్త అందింది. ఈ సీజ‌న్‌లో మ్యాచ్‌లను ఆడ‌డు అనుకున్న ఆల్‌రౌండ‌ర్ ఆర్చ‌ర్ ఈ సీజ‌న్ లో అందుబాటులో ఉంటాడు అని ముంబై యాజ‌మాన్యం ప‌రోక్ష సంకేతాలు పంపించింది. మైదానంలో ఆర్చ‌ర్ బ్యాటింగ్ ప్రాక్టిస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియ‌న్స్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప‌రుగుల ప్ర‌వాహం చూసేందుకు ఇక‌పై ఆగ‌లేమ‌ని పోస్ట్ చేసింది. దీనిని బ‌ట్టి చూస్తే ఆర్చ‌ర్ ఈ సీజ‌న్ నుండే బుమ్రాతో క‌లిసి బంతి పంచుకోవ‌డం ఖాయం అని తెలుస్తోంది.

 

Visitors Are Also Reading