Home » నయన్ తో సినిమాల్లోకి ధోని ఎంట్రీ…?

నయన్ తో సినిమాల్లోకి ధోని ఎంట్రీ…?

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ధోని మూడు ఐసీసీ టైటిల్స్ ను ముద్ధాడిన ఏకైక కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు. అయితే 2019 లో ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. కానీ ఈ ఐపీఎల్ 2022నే ధోనికి చివరి సీజన్ గా ప్రచారం జరుగుతుంది. దాంతో క్రికెట్ తర్వాత ఏం చేయాలి అనేదాని పైన ఫోకస్ పెట్టాడు ధోని.

Advertisement

ఆ క్రమంలోనే ప్రస్తుతం తమ సొంత రాష్ట్రం అయిన జార్ఖండ్ లో వ్యవసాయం ప్రారంభించిన ధోని.. తనకు ఎంతో మంది అభిమానులు ఉన్న తమిళనాడులో కూడా కొత్త అవతారం ఎత్తాలి అని నిర్ణయిచుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఐపీఎల్ లో మొదటి నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న ధోని నాలుగు ఐపీఎల్ టైటిల్స్ ను జట్టుకు అందించాడు. అందుకే అక్కడ ధోనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Advertisement

దాంతో తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో ధోని ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. కొత్తగా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి.. తమిళనాడు క్వీన్ అయిన నయనతారతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనీ ధోని ప్లాన్ చేస్తున్నాడు. ధోని దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియదు కానీ.. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత సినిమా అనౌన్సమెంట్ ఉంటుంది అని సమాచారం. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం చెన్నై రాణించలేకపోతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుండి కూడా తప్పుకుంది.

ఇవి కూడా చదవండి :

విరాట్ కోహ్లీ ఇండియా జట్టులో ఉంటాడా.. లేదా…?

తిరిగి వస్తున్న డివిలియర్స్… క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!

Visitors Are Also Reading