Home » బాలయ్య నో చెప్పిన కథతో మోహన్ బాబు హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా..?

బాలయ్య నో చెప్పిన కథతో మోహన్ బాబు హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా..?

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో హిట్లు పడాలి అంటే కొండంత టాలెంట్ తో పాటు గోరంత అదృష్టం కూడా ఉండాలి. కొన్నిసార్లు హీరోలు తమ దగ్గరకు వచ్చిన సినిమాలను వద్దని పంపిస్తే అదే సినిమా మరో హీరో చేసి బ్లాక్ బాస్టర్ అందుకుంటారు. ఆ తర్వాత ఎందుకు వదులుకున్నామా అని హీరోలు బాధపడుతుంటారు. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇక ఒకప్పుడు బాలయ్య కూడా ఒక సినిమాను వదులుకున్నారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… మోహన్ బాబు వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ను పిలిపించి తనతో ఓ సినిమా చేయాలని కోరాడు.

Advertisement

కానీ అప్పటికే రాఘవేంద్రరావు జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సినిమాతో ఇండస్ట్రీ లో రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం తర్వాత రాఘవేంద్రరావు వరుస ఫ్లాపులతో ఉన్న మోహన్ బాబు తో సినిమా చేయడం హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఈ సినిమా తర్వాత మోహన్ బాబు తో సినిమా చేయడం ఏంటని రాఘవేంద్రరావును హెచ్చరించారు.

Advertisement

కానీ ఆయన అవేమీ పట్టించుకోలేదు. మోహన్ బాబుతో అల్లుడుగారు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, శోభన ప్రధాన పాత్రలలో నటించారు. సెంటిమెంట్ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాను మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఓ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఈ చిత్రం అక్కడ బ్లాక్బస్టర్ అవ్వడం తో సినిమా రీమేక్ రైట్స్ ను మొదట సుహాసిని మేనేజర్ దక్కించుకున్నారు. అంతేకాకుండా ఈ కథతో బాలకృష్ణ దగ్గరకు వెళ్లారు.

కానీ బాలకృష్ణ సినిమా చేసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత ఈ సినిమా కథ చేతులు మారి మోహన్ బాబు చేతికి వెళ్ళింది. మోహన్ బాబు ఈ కథను రాఘవేంద్రరావు వినిపించగా ఆయన సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అలా బాలకృష్ణతో అనుకున్న సినిమా మోహన్ బాబు వద్దకు చేరి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

Also Read: 

సౌందర్య మరణం తరువాత భర్త పరిస్థితి అంత దారుణంగా ఉందా ? ఎలా ఉన్నారంటే ?

Visitors Are Also Reading