Home » నిజాలేంటో ఎవ్వ‌రికీ తెలియ‌దు..చిరుతో గొడ‌వ‌పై మోహ‌న్ బాబు సెన్సెష‌న‌ల్ కామెంట్స్..!

నిజాలేంటో ఎవ్వ‌రికీ తెలియ‌దు..చిరుతో గొడ‌వ‌పై మోహ‌న్ బాబు సెన్సెష‌న‌ల్ కామెంట్స్..!

by AJAY
Published: Last Updated on
Ad

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు నేడు పుట్టినరోజును జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు టాలీవుడ్ సెల‌బ్రెటీలు రాజ‌కీయ ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాంక్ష‌లు తెలుపుతున్నారు. ఇక పుట్టినరోజు సంధ‌ర్భంగా మోహ‌న్ బాబు ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంధ‌ర్బంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఇక చిరంజీవితో వ‌జ్రోత్స‌వాల‌లో జ‌రిగిన వివాదం గురించి యాంక‌ర్ మోహ‌న్ బాబును ప్ర‌శ్నించాడు.

ALSO READ : హీరోయిన్ ఛార్మికి అలాంటి మెసేజ్ లు చేసి..టార్చర్ పెట్టాడా ?

Advertisement

 

దానికి మోహ‌న్ బాబు మాట్లాడుతూ…సోషల్ మీడియాలో చాలా వ‌స్తుంటాయ‌ని అన్నారు. వాటిలో నిజాలేంటో అబ‌ద్దాలేంటో ఎవ‌రీకి తెలియ‌ద‌ని ఎప్పుడో జ‌రిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుక‌ని ప్ర‌శ్నించారు. ఇప్పుడు మేం సంతోషంగా ఉన్నామ‌ని..కొన్నిసార్లు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య స్నేహితుల మ‌ధ్య చిన్న చిన్న మాట‌లు దొర్లుతుంటాయ‌ని అన్నారు.

Advertisement

మ‌హాభార‌త రామాయ‌ణ భాగ‌వ‌తాల్లో చూశాం కాబ‌ట్టి అవి న‌థింగ్..ఆ విష‌యాలు వ‌ద్దు వేరే మాట్లాడుకుందాం అంటూ కామెంట్ చేశారు. అదేవిధంగా మా ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై కూడా మోహ‌న్ బాబు స్పందించారు. మా ఎల‌క్ష‌న్స్ ఒక చ‌రిత్ర అని అన్నారు.అలా ఎందుకు జ‌రిగిందా అని తాను ఆశ్చ‌ర్య‌పోతుంటానని అన్నారు.

బిడ్డ విష్ణు విజ‌యం సాధించాడ‌ని..ఎన్నిక‌ల్లో ఐవైతే హామీలు ఇచ్చాడో అవి అన్నీ నెర‌వేర్చాడ‌ని అన్నాడు. ఒక్క బిల్డింగ్ త‌ప్ప అన్ని ప‌నులు పూర్త‌య్యాయ‌ని చెప్పారు. ఊరికే కామెంట్ లు జోక్ లు చేస్తార‌ని అవి పిచ్చోడు తప్ప ఎవ‌రూ చూడ‌ర‌ని అన్నాడు. ఆ మ‌న‌సు క‌ష్టం చిరంజీవికి నాకూ రాకూడ‌ద‌ని చెప్పాడు. ఆ బాధ నాలో ఇప్ప‌టికీ ఉంద‌ని ఇప్పుడు ఆ విష‌యం చ‌ర్చించ‌ద‌లుచుకోవ‌ల‌ట్లేద‌ని వ్యాఖ్యానించారు.

ALSO READ :మనోజ్ పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు… భూమా మౌనికనే కారణమా?

Visitors Are Also Reading