Home » వైసీపీ నేత‌ల‌తో బాల‌య్య పీఏ పేకాట‌.. అదుపులోకి తీసుకున్న క‌ర్ణాట‌క పోలీసులు

వైసీపీ నేత‌ల‌తో బాల‌య్య పీఏ పేకాట‌.. అదుపులోకి తీసుకున్న క‌ర్ణాట‌క పోలీసులు

by Anji

ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో జోరుగా పేకాట స్థావ‌రాలు న‌డుస్తున్నాయి. ఈ త‌రుణంలో న‌గ‌రిగేర వ‌ద్ద పేకాట స్థావ‌రంపై క‌ర్ణాట‌క పోలీసులు దాడులు చేసారు. ఈ దాడుల్లో అనంత‌ర‌పురం జిల్లా హిందూపురానికి చెందిన 19 మంది పేకాట రాయుళ్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డ వారిలో ప‌లువురు వైసీపీ నేత‌ల‌తో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ పీఏ బాలాజీ కూడా ఉండ‌డం విశేషం. అత‌డు వైసీపీ నేత‌ల‌తో క‌లిసి పేకాట ఆడుతున్న‌ట్టు స‌మాచారం.


క‌ర్నాట‌క పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల‌లో హిందూపురం మండ‌ల వైసీపీ క‌న్వీన‌ర్ శ్రీ‌రామ్‌రెడ్డి కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిందితుల‌ను క‌ర్ణాట‌క‌లోని చిక్ బ‌ళ్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో పోలీసులు హాజ‌రు ప‌రిచారు. హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాల‌య్య పీఏ అరెస్ట్ కావ‌డం ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో హీట్ పుట్టిస్తోంది. అందులో అత‌డు వైసీపీ నేత‌ల‌తో పేకాట ఆడ‌డం అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ముఖ్యంగా బాల‌య్య కార్య‌క్ర‌మాల‌తో పాటు హిందూపురంలో వ్య‌వ‌హారాల‌న్నీ బాలాజీనే చూస్తాడ‌. అత‌ను వైసీపీ నేత‌ల‌తో అంట‌కాగ‌డం ఏమిట‌ని ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read :  ఐపీఎల్‌లో సూప‌ర్ ఓవ‌ర్‌లో విజ‌యం సాధించిన మ్యాచ్‌లు ఇవే..!

Visitors Are Also Reading