రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సినిమా మగధీర. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అటు రాజమౌళి క్రేజ్ ఇటు రామ్ చరణ్ క్రేజ్ కూడా ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా పూర్వజన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Also Read: సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతున్న ఆచార్య..!
Advertisement
సినిమాలో నాలుగు వందల ఏళ్ల తరవాత మగధీర హర్షగా మళ్లీ జన్మిస్తాడు. అంతే కాకుండా నాలుగు వందల ఏళ్ల తరవాత యువరాణి మిత్రబింద మళ్లీ జన్మిస్తుంది. ఇక వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్ నుండే అసలు కథ కూడా మొదలవుతుంది. మొదటిసారి కాజల్ చేయి తగలగానే రామ్ చరణ్ కు పూర్వజన్మ గుర్తుకు వస్తుంది.
Advertisement
ఆ సమయంలో ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అయినట్టుగా చూపిస్తాడు. ఆ తరవాత మళ్లీ కొన్నిసార్లు కూడా ఇదేరకంగా కరెంట్ పాస్ అవుతుంది. అయితే ఈ సినిమా చూసిన తరవాత కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇద్దరూ కలుసుకున్నారు. ఓకే మరి పెళ్లి తరవాత ఇద్దరూ ఒకరిని ఒకరు తాకినా కూడా ముందులానే కరెంట్ పాస్ అవుతుందా..? లేదంటే అలా షాక్ రావడం ఆగిపోతుందా..? దఈదీనిపై దర్శకుడు కూడా ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు మరి.
నిజానికి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ సీన్ కు సంబంధించిన మీమ్స్ నెట్టింట దర్శనం ఇస్తున్నాయి. ఏది ఏమైనా కథ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది కాబట్టి చిన్న చిన్న లాజిక్స్ ను కూడా పక్కనపెట్టేశారు. దాంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.