2022 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో కాంతార సినిమా కూడా ఒకటి. కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం తో పాటు సినిమాలో హీరోగా నటించాడు. కర్ణాటకలోని ప్రసిద్ధ భూత కోల అనే సంస్కృతి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మొదట కన్నడ సినిమాగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.
Also Read: “దృశ్యం” సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందంటే ?
Advertisement
దాంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేశారు. ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురిసింది. ఇక కన్నడలో ఏకంగా కేజీఎఫ్ సినిమాకు మించిన కలెక్షన్లు వచ్చాయి. అంతే కాకుండా కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొత్తం 400 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
Advertisement
Also Read: నరేష్ కు పవిత్ర దగ్గరవ్వడానికి అసలు కారణం అదేనా…? మూడో భార్య ఏం చెబుతోంది..!
ఇది ఇలా ఉంటే ఈ సినిమా పై కొన్ని ట్రోల్స్ కూడా నెట్టింట దర్శనం ఇస్తున్నాయి. ఈ సినిమాలో మొదట రాజు అడవిలోని ప్రజలకు వారి దైవాన్ని తీసుకుని భూమిని అప్పగిస్తాడు. అయితే ఆ తర్వాత రాజు వారసుడు ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేయగా ….కోలం ఆడే వ్యక్తి దేవుడితో పెట్టుకుంటే కోర్టు మెట్లు ఎక్కే సమయంలో చనిపోతావని హెచ్చరిస్తాడు.
అలానే జరుగుతుంది. అయితే ఆ తర్వాత మరో వారసుడు వచ్చి ఏకంగా కోలమాడే వ్యక్తిని హతమారుస్తాడు. దాంతో కోలమాడే వ్యక్తి జరిగే విషయాన్ని ముందే ప్రజలకు చెబితే సరిపోయేది కదా.. ఇంత చిన్న లాజిక్ ను దర్శకుడు ఎలా మిస్ అయ్యాడు… అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Also Read: షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవే !