పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాను అయ్యప్పనుమ్ కొషియం రీమేక్ గా తెరకెక్కించారు. సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా…..త్రివిక్రమ్ మాటలు రాశారు. ఇక ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యా మీనన్ నటించగా…..రానా కు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
Advertisement
ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 25 న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఎన్నో అంనచనాలను పెంచేసింది. టీజర్ భ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరియు పవన్ కళ్యాణ్ యాక్షన్ టీజర్ ను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు.
Advertisement
కాగా ఈ ట్రైలర్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ట్రైలర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గానీ సీన్లు కానీ పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయాయి. దాంతో సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యం లో ఏదో ఆదరబాదరాగా ట్రైలర్ ను కట్ చేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రైలర్ నచ్చలేదని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
మరో వైపు ట్రైలర్ లో మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రైలర్ లో పోలీస్ స్టేషన్ సీన్ లో రానా కోపం తో కుర్చీ ని తంతాడు….కానీ తన్నిన చాలా సమయం తరవాత సౌండ్ వస్తోంది. అంతే కాకుండా కొన్ని ఫైట్ ఎలివేషన్ సీన్ లలో కూడా పర్ఫెక్షన్ దొబ్బింది. దాంతో సినిమా అయినా నచ్చుతుందా లేదా అన్న అమానాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా చూడాలంటే ఈ నెల 25 వరకు ఆగాల్సిందే.