Home » పవన్ కళ్యాణ్ ఓ కరివేపాకు.. అంటున్న మంత్రి రోజా..!!

పవన్ కళ్యాణ్ ఓ కరివేపాకు.. అంటున్న మంత్రి రోజా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రగడ ఎక్కువవుతుంది. ముఖ్యంగా పవన్ తన రాజకీయ వేగాన్ని పెంచేశారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ముందుకెళ్తున్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ మాటలను అధిష్టానం కూడా తిప్పి కొడుతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కరివేపాకు లాంటివాడని సంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.

Advertisement

also read;వెంకటేష్ పక్కన పెట్టిన సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగార్జున…ఆ సినిమా ఏదంటే…?

సోమవారం శ్రీశైలం ప్రాజెక్టు లోని మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను శ్రీశైలం ప్రాజెక్టులో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అందరినీ కరివేపాకుల వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజం అని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు వారి యొక్క పత్రికలు ఎత్తినట్టే ఎత్తి కింద పడేసాయని,దీనిని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలని అన్నారు.

Advertisement

మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం ఉందని అక్కడ ఏదైనా సంఘటన జరిగితే ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్ పర్యటించాల్సింది పోయి పవన్ కళ్యాణ్ ను కరివేపాకుల ముందుకు తోసారని ఎద్దేవా చేశారు. జనసేన అంటే సైకో సేనలాగా రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ప్రజలందరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధంగా రోజా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

also read;జులాయి, అల వైకుంఠ పురం సినిమాలలో ఉన్న ఒకే కామన్ పాయింట్ ను గమనించారా…?

Visitors Are Also Reading