Home » సరికొత్త చిరంజీవిని చూస్తారు…అంచనాలు పెంచేస్తున్న మెహర్ రమేష్ …!

సరికొత్త చిరంజీవిని చూస్తారు…అంచనాలు పెంచేస్తున్న మెహర్ రమేష్ …!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. సినిమాలో చిరు కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

Advertisement

ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధి గా రాజమౌళి వచ్చారు. అంతే కాకుండా మెగాస్టార్ తో సినిమా లు చేస్తున్న దర్శకులు బాబీ, మోహన్ రాజా, మెహర్ రమేష్ కూడా హాజరయ్యారు. ఇదిలా ఉంటే మెహర్ రమేష్ చిరంజీవి కాంబినేషన్ లో భోళా శంకర్ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే మెహర్ దర్శకత్వం లో వచ్చిన షాడో, శక్తి సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి. దాంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే మెహర్ రమేష్ మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి సినిమా అంటే ఒక పండుగ లాగా ఉంటుందని అన్నారు. అలాంటిది కొరటాల శివ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరినీ చూపిస్తున్నారు కాబట్టి కన్నుల పడుగే అని అన్నారు. ఆచార్య సినిమా ఇంటర్వెల్ సీన్ చూసా అని మునుపెన్నడూ లేని చిరంజీవిని చూస్తారని చెప్పారు. బంజారా సాంగ్ లో చిరంజీవి డాన్స్ హైలెట్ అని చెప్పారు.

Also read :

RGV నాగార్జునల శివ సినిమా స్టోరీ విని ఇండస్ట్రీలో ఏమనుకున్నారో తెలుసా ?

కేజీఎఫ్ లో జూనియర్ యష్ గా నటించింది ఎవరో తెలుసా…అతడి బ్యాగ్రౌండ్ ఇదే…!

Visitors Are Also Reading