Home » బాలకృష్ణ అన్ స్టాపబుల్ కి మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ కంటే ముందే..!

బాలకృష్ణ అన్ స్టాపబుల్ కి మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ కంటే ముందే..!

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది ఆహా ఓటీటీ వేదికగా హోస్ట్ గా వ్యవహరించారు. రెండో సీజన్ కి కూడా బాలయ్యనే హోస్ట్ వ్యవహరిస్తూ.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తూ.. వారితో తనదైన స్టైల్ లో ప్రశ్నలను వేస్తూ షోలో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి సీజన్ లో 10 ఎపిసోడ్లు ఉండగా.. 10 ఎపిసోడ్లు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. తొలి సీజన్ లో మోహన్ బాబు, సుకుమార్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, నాని వంటి సెలబ్రిటీలతో సందడి చేశారు బాలయ్య. 

Advertisement

బాలయ్య అన్ స్టాపబుల్ రెండో సీజన్ లో ఫస్ట్ గెస్ట్ గా బాలయ్య బావ, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్ విచ్చేశారు. ఆ తరువాత పలువురు సినీ హీరోలు, రాజకీయ నేతలు వచ్చారు. ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ విచ్చేసి ఆహాని స్ట్రక్ అయ్యేవిధంగా చేసిన విషయం విధితమే. ప్రభాస్ సెకండ్ ఎపిసోడ్ జనవరి 06న స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షో షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వీరిద్ధరి సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ షోకి మెగాస్టార్ రానున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Also Read :  Veera Simhareddy: వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వేదిక అక్కడేనా..?

Manam News

బాలయ్యతో సరిసమానులైన చిరంజీవి అన్ స్టాపబుల్ షోకి మాత్రం ఎందుకు రావడం లేదని అభిమానుల్లో ఓ సందేహం ఉండేది. అలాంటి సందేహాలకు త్వరలోనే తెరపడబోతుందని తెలుస్తోంది. చిరంజీవి కూడా అన్ స్టాపబుల్ షో లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే ఈ ఎపిసోడ్ మొత్తం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలపైనే ఉండబోతుందని సమాచారం. మరోవైపు ఈ రెండు సినిమాలకు నిర్మాత కూడా ఒక్కరే కావడంతో ఇలా చేస్తే రెండు సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో బాగా కలిసొస్తుందనే ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆలోచన తొలుత మెగాస్టార్ కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ లో బాలయ్య వీరసింహారెడ్డి ఎపిసోడ్ అంటూ వచ్చిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలనుకుంది ఆహా టీమ్. కానీ దానికంటే ముందే ఇలా ప్లాన్ చేస్తే మరింత క్రేజీ ఉంటుందని చిరంజీవి, బాలయ్య ఇద్దరూ అనుకున్నట్టు సమాచారం. సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కలిసొస్తే.. అభిమానులకు ఇక ఫుల్ పండుగే..!

Also Read :  బాలయ్య, పవన్‌ ఫ్యాన్స్‌ మధ్య ఫైట్..TDP లేకపోతే పవన్ అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేడంటూ !

Visitors Are Also Reading