Home » మీనా త‌న భ‌ర్త‌పై గ‌తంలో చేసిన పోస్ట్ వైర‌ల్..అందులో ఏముందంటే..!

మీనా త‌న భ‌ర్త‌పై గ‌తంలో చేసిన పోస్ట్ వైర‌ల్..అందులో ఏముందంటే..!

by AJAY
Ad

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా ప్రస్తుతం అక్క‌, వ‌దిన పాత్ర‌లు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమాలో మీనా హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా మీనా భర్త రీసెంట్ గా అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ చికిత్స పొందుతూ జూలై 29న కన్నుమూశారు.

Advertisement

అయితే విద్యాసాగర్ మీనా దంపతుల ఇంటి చుట్టూ ఎక్కువ సంఖ్యలో పావురాలు ఉండటం వల్లే ఆయనకు శ్వాస కోశ‌ సంబంధిత వ్యాధులు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. పావురాల వ‌ల్ల‌నే ఆయ‌న‌కు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వ‌చ్చింద‌ని వార్త‌లు వినిపించాయి. అంతేకాకుండా కరోనా బారిన పడిన నాటినుండి విద్యాసాగర్ ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని కూడా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మీనా ఆ వార్త‌ల‌పై స్పందించారు.

Advertisement

పరిస్థితిని అర్థం చేసుకుని మీడియా సంయమనం పాటించాలని కోరారు. తమకు గోప్య‌త‌ను ఇవ్వాలని… తన భర్త విషయంలో ఎలాంటి అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఇలాంటి ఇబ్బందికర సమస్యల్లో సహృదయంతో తనకు.. తన కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మీడియా మిత్రులకు సైతం మీనా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు మీనా స్నేహితురాలు కళా మాస్టర్ ఓ ప్రకటనలో విద్యాసాగర్ కు కరోనా కారణంగా ఆరోగ్య పరమైన ఇబ్బందులు వచ్చాయని చెప్పారు.

ఆయనకు ఊపిరితులు మార్చాల్సి వచ్చిందని ఎంత ప్రయత్నించినా దాతలు దొరకకపోవడంతో ఆయన మరణించార‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా గతంలో మీనా తన భర్త పై చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీనా తమ పెళ్ళి రోజు సందర్భంగా భర్తతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి…. నా జీవితంలోకి ఇంద్రధనస్సులా వచ్చి రంగుల మయంగా మార్చావు. నీతో గడిపే ప్రతి క్షణాన్ని మధురంగా మిగిల్చావు. ఎల్లప్పుడూ నువ్విచ్చిన నువ్వు నా వెంటే ఉంటుంది…. నా భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

Visitors Are Also Reading