Home » బయటకు వచ్చినా మీనా భర్త ఆస్తుల వీలునామా..కోట్ల ఆస్తులు ఆమె పేరు మీదే రాశారా..?

బయటకు వచ్చినా మీనా భర్త ఆస్తుల వీలునామా..కోట్ల ఆస్తులు ఆమె పేరు మీదే రాశారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బాలనటిగా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మారిన నటి మీనా. తన కెరీర్ పీక్ స్టేజిలో ఉండగానే విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వారి వివాహ బంధం వందేళ్లు నిలువక ముందే మధ్యలోనే విషాదంగా మారింది. అనారోగ్యంతో విద్యాసాగర్ మరణించడం మీనాకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన మరణించినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో వార్తలుగా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మరో వార్త లైవ్ లోకి వచ్చింది.

Advertisement

అదేంటంటే విద్యాసాగర్ ఆస్తుల విషయం.. ఆయన బ్రతికి ఉన్న సమయంలోనే ఆయన ఆస్తి ఎవరికి చెందాలి అనే విషయం వీలునామా రాసినట్లు తెలుస్తోంది. విద్యాసాగర్ మొదటి నుంచి చాలా సంపన్న కుటుంబంలో ఉన్న వ్యక్తి. దాదాపు వారి ఆస్తి 250 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అయితే ఆయన తదనంతరం ఆయన మొత్తం ఆస్తులు ఎవరి పేరు మీద రాశారు అని తెలిస్తే అందరం ఆశ్చర్యపోవాల్సిందే. తన ఆస్తి మొత్తం తన ముద్దుల కూతురు నైనిక పేరు మీద వీలునామా రాసి పెట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

తన కూతురు లైఫ్ ను దృష్టిలో పెట్టుకొని తనకూతురు పేరు మీదే రాసారట విద్యాసాగర్. ఆస్తి మొత్తం కూతురు నైనిక మేజర్ అయిన తర్వాత చెందుతుందని, ఆస్తిలో తనను చేసుకోబోయే భర్త కు కూడా సగం వాటా ఉంటుందని వీలునామాలో చెప్పారట. అప్పటివరకు ఆస్తికి ఎవరు యజమానిగా ఉండాలి అనే విషయాన్ని కూడా వీలునామాలో రాశారట. అయితే ఈ వార్తల్లో నిజమెంతో అబద్ధం ఎంత ఉందో తెలియదు కానీ విద్యాసాగర్ ఇలాంటి పని చేసి ఉంటే మాత్రం ఆయన గొప్ప మనస్తత్వం చాటిన తండ్రి అవుతాడని నెటిజన్లు అంటున్నారు.

ALSO READ:

Visitors Are Also Reading