రష్యా టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా, ఫార్ములా వన్ రేసింగ్ మాజీ ఛాంపియన్ మైఖేల్ షుమాకర్తో సహా మరికొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గురుగ్రామ్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఢిల్లీలోని చత్తార్పూర్ మినీ ఫామ్కు చెందిన షఫాలీ అగర్వాల్ అనే మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో వారిపై చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు.
Advertisement
రియల్ టెక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ ప్రాస్ట్రక్షర్ ఇండియా ప్రైవేటు లిమిటేడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ తమను మోసం చేసిందని.. సెక్టార్-73లో షరపోవా ప్రాజెక్ట్ పేరిట షుమాకర్ టవర్స్ అపార్టుమెంట్ లో ఓ ప్లాట్ కోసం తమ వద్ద నుంచి కంపెనీ ప్రతినిధులు సుమారు రూ.80లోలు తీసుకున్నారని చెప్పారు. దానిని 2016లోనే అందిస్తామని చెప్పినా ఇంతవరకు తమకు ఎలాంటి లబ్దిచేకూరలేదు అని షఫాలీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Advertisement
ఆ ప్రాజెక్ట్లో షరపోవా, షుమాకర్ భాగస్వాములుగా ఉండడమే కాకుండా ప్రచారకర్తలుగా ఉన్నారని చెప్పారు. అదేవిధంగా ఆసంస్థ ప్రచార చిత్రాల్లోనూ తప్పుడు ప్రమాణాలు చేశారని వివరించారు. షరపోవా, షుమాకర్లు కొనుగోలు దారులతో డిన్నర్ పార్టీల్లోనూ పాల్గొన్నారని అదేవిధంగా ఆ ప్రాజెక్ట్లో టెన్నిస్ అకాడమితో పాటు క్రీడా క్లబ్ నిర్వహిస్తామనే తప్పుడు ప్రమాణాలు చేశారన్నారు. ఈ విషయంలో సదరు కంపెనీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా తమకు న్యాయం జరుగలేదని.. దీనితో జాతీయ వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయినదని చెప్పారు. ఈ తరుణంలో కోర్టును ఆశ్రయించగా.. వారిపై చీటింగ్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు.
Also Read : పుష్ప-2 లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కు బంపరాఫర్..!