Home » అయ్యో పాపం…పెళ్లికి వచ్చిన అతిథులే చైతూ హీరోయిన్ ను అలాంటి మాటలు అన్నారా…?

అయ్యో పాపం…పెళ్లికి వచ్చిన అతిథులే చైతూ హీరోయిన్ ను అలాంటి మాటలు అన్నారా…?

by AJAY
Ad

సన్నబడితే అయ్యో సన్నబడ్డావ్ ఏమైంది..ఆరోగ్యం సరిగా లేదా..? ఏదైనా సమస్యా అని అడుగుతుంటారు. అదే కొంచెం లావు అయితే ఒహ్ గాడ్..ఇంత లావు అయ్యావ్ ఏంటి..? ఇలా అయితే కష్టం అని అంటూ ఉంటారు. కాబట్టి ఎలా ఉన్నా ఏం చేసినా అనే వాళ్ళు అంటూనే ఉంటారు. అయితే అవి కొన్నిసార్లు మనసును నొప్పించే ఛాన్స్ కూడా ఉంది. తాజాగా ఓ హీరోయిన్ కు అలాంటి అనుభవమే ఎదురైంది.

Advertisement

పెళ్లికి వచ్చి ఆశీర్వదించండి అని అతిథులను కోరితే వచ్చి తిని వెళ్లకుండా లావు గా అయ్యావ్ ఏంటి అంటూ ప్రశ్నలు వేశారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు. మంజిమ మోహన్…ఈ మలయాలి ముద్దుగుమ్మ నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మంజిమ మోహన్ చిన్న వయసులోనే మలయాళం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించింది.

Advertisement

ఆ తరవాత శింబు కు జోడిగా సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఒరిజినల్ తమిళ్ వెర్షన్ లో నటించింది. మొదటి సినిమా తోనే బెస్ట్ హీరోయిన్ అవార్డు ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మంజిమా తన ప్రియుడు…హీరో గౌతమ్ కార్తీక్ ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి వచ్చిన అతిథులు తనను లావుగా ఉన్నావ్ అంటూ నెగిటివ్ కామెంట్ లు చేశారని చెప్పింది. కానీ తాను ఆ కామెంట్స్ కు కృంగిపోను అని ప్రస్తుతం శరీరం తో ఫిట్నెస్ గా ఉన్నాను అని చెప్పింది. అంతే కాకుండా తనకు కావలసినప్పుడు సన్న బడతాను అని ధీమా వ్యక్తం చేసింది.

Visitors Are Also Reading