ఇటీవల సినీపరిశ్రమ పెద్దలు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి వెళ్లిన వారిలో సీనియర్ హీరోలలో చిరంజీవి ఒక్కరే ఉన్నారు. బాలయ్య వెళ్లనని..నాగార్జున అమలకు కరోనా రావడం వల్ల వెళ్లలేకపోయారు. అయితే ఈ మీటింగ్ కు మోహన్ బాబు వెళ్లకపోవడం చర్ఛనీయాంశం అయ్యింది. కాగా దానిపై మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తాజాగా స్పందించారు. నాన్నగారు మిస్ కమ్యూనికేషన్ వల్ల వెళ్లలేదని అన్నారు.
Advertisement
నాన్నగారికి ఆహ్వానం అందించినట్టు పేర్నినాని తమతో చెప్పారని అన్నారు. కానీ ఆ ఆహ్వానం అందినట్టు తన తండ్రికి సమాచారం ఇవ్వలేదని అందువల్లే వెళ్లలేదని అన్నారు. ఇండస్ట్రీలో మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ హీరోలకు కూడా ఆహ్వానం అందిందని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. తన తండ్రిని ఎవరు కావాలనే అవాయిడ్ చేశారో తమకు తెలుసు అని దానిపై నిర్మాతలు ఇతర ఇండస్ట్రీ పెద్దలతో చర్చిస్తామని మంచు విష్ణు అన్నారు.
Advertisement
తనకు టీడీపీ వైసీపీలో స్నేహితులు ఉన్నారని కానీ మీడియా మాత్రం తప్పుడు చేశారని అన్నారు. పేర్నినాని ఇంటికి వచ్చినప్పటికీ అన్ని విషయాలు మాట్లాడుకున్నామని చెప్పారు. అయితే అదే విషయాన్ని తాను ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే వార్తల్లో తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. సీఎం జగన్ తో కూడా పర్సనల్ గా మాట్లాడుకున్నామని అన్నారు. ఓ మీడియా ప్రతినిధి దాసరి చనిపోయిన తరవాత మంచు ఫ్యామిలీకి సపోర్ట్ తగ్గిందా అని ప్రశ్నించగా…సపోర్ట్ లేకుండా తాను మా ప్రెసిండ్ అయ్యేవాడినే కాదని విష్ణు అన్నారు. అవతల వారిని చిత్తుచిత్తుగా ఓడించానని చెప్పారు.