Home » అయ్యో పాపం..మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి !

అయ్యో పాపం..మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి !

by Bunty
Ad

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మమతా మోహన్ దాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించడంతోపాటు ఇంకా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి, ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అనే విషయం తెలిసిందే. 15 ఏళ్ల క్రితం తన అందంతో తెలుగు నాటపేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఆడపాదడపా సినిమాలు చేస్తుంది.

Advertisement

ఆ తర్వాత మలయాళ చిత్రాలపై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ కొంతకాలం క్రితం క్యాన్సర్ బారిన కూడా పడింది. ఆ వ్యాధిని జయించిన ఆమె ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో మరోసారి వార్తల్లో నిలిచింది మమత. మమతా మోహన్ దాస్ తాను చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ నటి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వ్యాధి కారణంగా చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడినట్లు తెలిపింది.

ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. “ప్రియమైన సూర్యుడా, గతంలో కంటే ఇప్పుడు నిన్ను ఎక్కువగా ఇష్టపడుతున్నాను. నేను రోజు రంగును కోల్పోతున్నాను. పొగ మంచులో మెరిసే నీ కిరణాలను చూసేందుకు ప్రతి ఉదయం చూస్తున్నాను. అవి నన్ను తాకాలని వాటి కోసం బయటకు వస్తున్నాను. నాకు ఇప్పుడు వాటికి అవసరం ఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నాను. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని తన పోస్టులో పేర్కొంది మమతా మోహన్ దాస్.

READ ALSO : తండ్రి అయిన టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ

Visitors Are Also Reading