Home » జేడీతో వెళుతున్నప్పుడు బైక్ యాక్సిడెంట్..అలా బ్రతికిపోయాం అంటున్న హీరోయిన్….!

జేడీతో వెళుతున్నప్పుడు బైక్ యాక్సిడెంట్..అలా బ్రతికిపోయాం అంటున్న హీరోయిన్….!

by AJAY
Ad

అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మహేశ్వరి. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మహేశ్వరి తెలుగు ప్రేక్షకులను అలరించింది. మహేశ్వరి హీరోయిన్ గా నటించిన సినిమాల్లో గులాబీ సినిమా ఒకటి. ఇక రీసెంట్ గా మహేశ్వరి ఆలీతో సరదాగా అనే టీవీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా గులాబీ సినిమా గురించి చెబుతూ మేఘాలలో తేలిపొమ్మన్నది పాట షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని చెప్పింది.

Maheshwari

Advertisement

Advertisement

ఆ పాట షూటింగ్ కు ముందు తానెప్పుడూ బైక్ ఎక్కలేదని చెప్పింది. అంతేకాకుండా ఈ సాంగ్ లో బైక్ పై చాలా వేగంగా వెళ్లాలని జెడి చక్రవర్తి తో దర్శకుడు కృష్ణవంశీ చెప్పారని తెలిపింది. దాంతో తనకు భయం పెరిగిపోయిందని జెడి చక్రవర్తి చాలా స్పీడ్ గా బైక్ నడిపాడని పేర్కొంది.

పాట షూటింగ్ చేసిన సందర్భంలో బైక్ స్కిడ్ అయిందని మహేశ్వరి తెలిపింది. దాంతో బైక్ ఒక్కసారి కాలువలోకి వెళ్లి పడిపోయిందని తనకు ఏమీ అర్థం కాలేదని అయితే అందులో ఒక చెట్టు ఉండడం వల్ల బతికి బయటపడ్డామని చెప్పుకొచ్చింది. అక్కడే ఉన్న వాళ్ళు బైక్ ను వెనక్కి లాగాలని అలా ప్రమాదం నుండి బయటపడ్డామని తెలిపింది.

Visitors Are Also Reading