Home » ఆ ముగ్గురు హీరోల మధ్య “బ్రాండ్స్” పోటీ..అసలు విషయం తెలిస్తే..!!

ఆ ముగ్గురు హీరోల మధ్య “బ్రాండ్స్” పోటీ..అసలు విషయం తెలిస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏదైనా ప్రోడక్ట్ గురించి జనాలకు ఈజీగా తెలియాలంటే వారు ఎంచుకునేది ముఖ్యంగా స్పోర్ట్స్ లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన వారిని, లేదంటే సినిమాల్లో స్టార్ నటుల ద్వారా వారివారి బ్రాండ్లను జనాలకి పరిచయం చేస్తారు. అయితే క్రేజ్ ఉన్న హీరో ఒక చిన్న మాట చెప్పినా తమ ప్రాడక్టుకు రేంజ్ పెరుగుతుందని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి యాడ్ చేస్తున్నాయి. ఈ విషయంలోనే ఆ ముగ్గురు స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. వారు ఎవరయ్యా అంటే..

Advertisement

 

 

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నా కానీ ఈ బ్రాండ్ల విషయానికొస్తే టాప్ త్రీ లో ఉండేది మహేష్ బాబు, బన్నీ, విజయ్ దేవరకొండ ఉంటారు. బ్రాండింగ్ విషయంలో ఈ ముగ్గురు హీరోల మధ్య పోటీ నెలకొంది. టాప్ కంపెనీలన్నీ ఈ ముగ్గురు చుట్టే తిరుగుతున్నాయి. వారి ప్రాడక్టుల గురించి చిన్న మాట చెబితే కోట్లలో టర్నోవర్ పెరుగుతుందని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి యాడ్స్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు రకరకాల యాడ్స్ చేసి కోట్ల రూపాయలు సంపాదించారు. అభిబస్, సంతూర్ ఇలా అనేక యాడ్స్ లో నటించారు.

Advertisement

 

ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే క్లాతింగ్, స్టైలింగ్ బ్రాండ్స్ కే ఎక్కువగా మొగ్గు చూపుతూ వచ్చారు. కూల్ డ్రింక్ యాడ్స్ లో కూడా నటించారు. పుష్ప సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన బన్నీకి నేషనల్ వైడుగా పేరు వచ్చింది. దీంతో అల్లు అర్జున్ తో యాడ్ చేయించుకోవడానికి పరుగులు పెడుతున్నాయి కంపెనీలు. ఇప్పటికే జొమాటో, రాపిడో యాడ్ చేసిన అల్లు అర్జున్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. మొత్తానికి ముగ్గురు హీరోలు రకరకాల యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ALSO READ:

క‌ళ్యాణ్ రామ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అలా జ‌రిగితే సినిమాలు మానేస్తా..!

శ్రీ‌కృష్ణుడి మ‌ర‌ణ ర‌హ‌స్యం గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading