Home » పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా మహేష్ బాబు, కేటీఆర్…!

పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా మహేష్ బాబు, కేటీఆర్…!

by AJAY
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా రానా కు హీరోయిన్ గా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

అయితే సంక్రాంతి కి విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఫిబ్రవరి 25 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేథ్యంలోనే మేకర్స్ యూసుఫ్ గూడా గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులు గా కెటిఆర్ మరియు మహేష్ బాబు రాబోతున్నట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading