సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య అయిన నమ్రతా శిరోద్కర్ హీరోయిన్ గా తెలుగు అభిమానులకు పరిచాయామ్ అయిన విషయం తెలిసిందే. మొదట మెగాస్టార్ చిరంజీవితో అంజి అనే సినిమాలో చేసిన నమ్రతా శిరోద్కర్.. ఆ తర్వాత మహేష్ బాబుతో వంశీ అనే సినిమాను చేసింది. ఇక ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడిన ఈ ఇద్దరు.. త్వరగానే పెళ్లి కూడా చేసుకున్నారు.
Advertisement
ఇక ఇన్ని రోజులుగా కలిసి ఉన్న ఈ జంట అందరికి ఆదర్శంగా నిలిచింది అనే చెప్పవచ్చు. అయితే పెళ్లి తర్వాత నమ్రతా శిరోద్కర్ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది. తనకు తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చిన చెయ్యలేదు. అయితే ఈ మధ్యే పావన కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది అనే విషయం తెలిసిందే. ఆ కారణంగానే నమ్రతా శిరోద్కర్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలి అని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Advertisement
అయితే ఇప్పుడు వారికీ గుడ్ న్యూస్ అనేది రానున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా లేని నమ్రతా శిరోద్కర్.. ఈ మధ్య వరుస ఫోటోలు పెడుతూ బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు సూపర్ స్టార్ భార్య అయినా.. సినిమాల్లో చేస్తే ఫ్యాన్స్ ఎలా అనుకుంటా అనో భావనతో సినిమాలకు దూరంగా ఉన్న నమ్రతా శిరోద్కర్.. ఇప్పుడు సపోర్టింగ్ రోల్ లో చేయాలనీ ఫిక్స్ అయ్యినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :