Home » పవిత్ర విషయంలో నరేష్ కు మహేష్ సూచనలు..!

పవిత్ర విషయంలో నరేష్ కు మహేష్ సూచనలు..!

by Azhar
Ad

నరేష్ – పవిత్రల విషయం రోజు రోజుకు ముదురుతోంది. అయితే చాలా రోజులుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు అనేవి వచ్చాయి. వీరి మధ్య ఏదో జరుగుతుంది అనే అనుమానాలు మాత్రమే ఉండేవి. కానీ నరేష్ మూడో భార్య అయిన రమ్య… మైసూర్ లోని హోటల్ లో నరేష్, పవిత్రలను పట్టుకుంది. వారిద్దరూ ఒక్కే రూమ్ లో ఉండటం ప్రపంచానికి చూపించింది. అయితే నరేష్, పవిత్ర ఆ హోటల్ లో ఒక్కే రూమ్ నుండి బయటకు వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతే కాకుండా అక్కడ బయటకు వచ్చిన తర్వాత నరేష్ చేసిన పనులు కూడా చాలా మందికి కోపం అనేవి తెప్పించాయి.

Advertisement

నరేష్ బయటకు వచ్చిన తర్వాత రమ్యను చూస్తూ విజిల్ వెయ్యడం.. అలాగే కార్లో ఎక్కే ముందు ఆమె గురించి చేసిన కామెంట్స్ అనేవి తెగ ట్రోల్ చేసారు. ఇదిలా ఉంటె ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ పేరు అనేది వచ్చింది. పవిత్ర మాట్లాడుతూ.. ఇదంతా ఆయనకు తెలిసే చేస్తున్నం అని ప్రకటించింది. దాంతో ఈ విషయంలో నరేష్ పైన కృష్ణ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. నరేష్ ను మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ నరేష్, పవిత్రల విషయంలో కొన్ని కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజాగా మహేష్ నరేష్ తో ఈ విషయంలో మాట్లాడారట. ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటె… అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి కానీ.. ఇలా కుటుంబ విషయాలను బయట పెట్టకూడదు అని చెప్పారట. మరి ఈ మాటలను నరేష్ ఏ మేర సీరియస్ తీసుకుంటారు అనేహి చూడాలి. అయితే నరేష్ ఇంకా తన మూడో భార్య అయిన రమ్యకు విడాకులు అనేవి ఇవ్వలేదు. అందుకే నరేష్, పవిత్రల బంధం విషయంలో రమ్య జోక్యం చేసుకుంటుంది. ఇక పవిత్ర కూడా తన రెండో భర్తకు విడాకులు ఇవ్వలేదు. కానీ ఆయన ఈ విషయంలో అంతలా మాట్లాడటం లేదు.

ఇవి కూడా చదవండి :

ఆసియా కప్ పై లంక బోర్డు కీలక ప్రకటన..!

కోహ్లీని తీసేస్తే బీసీసీఐకే నష్టం.. ఎలా అంటే..?

Visitors Are Also Reading