Home » మహేష్ బాబు “బిజినెస్ మ్యాన్” సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా….? ఆ ఒక్క కారణంతోనే…!

మహేష్ బాబు “బిజినెస్ మ్యాన్” సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా….? ఆ ఒక్క కారణంతోనే…!

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్ ల లిస్ట్ లో పూరి జగన్నాథ్ ఒకరు. టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ ను పిలుస్తూ ఉంటారు. పూరీ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ ను టాలీవుడ్ లో లాంచ్ చేసింది కూడా పూరీజగన్నాథ్ కావడం చెప్పుకోదగ్గ విశేషం. అంతే కాకుండా దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను కూడా పూరినే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

Advertisement

రీసెంట్ గా పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను నిర్మించారు. ఇక ఆగస్ట్ 25 న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం తో పాటు సినిమాను నిర్మించారు కూడా.

Advertisement

సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోవడం తో పూరీ జగన్నాథ్ తో పాటు ఛార్మీ కూడా చాలా నష్టపోయారు. ఇదిలా ఉంటే పూరీ దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో బిజినెస్ మ్యాన్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పటికీ కూడా బోర్ కొట్టదు. ఈ సినిమాలో మహేష్ బాబు సైలెంట్ గా కనిపిస్తూనే తన నటన మాస్ లుక్స్ తో అలరించాడు.

అయితే ఈ సినిమా కథను ముందుగా పూరీ జగన్నాథ్ మహేష్ బాబుకు చెప్పలేదు. మొదట ఈ సినిమా స్క్రిప్ట్ ను తమిళ స్టార్ హీరో సూర్య కు చెప్పాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తరవాత పూరీ అదే కథను మహేష్ బాబు తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Visitors Are Also Reading