Home » బయట10రూ”పునుగులు.. నమ్రత హోటల్లో 125 రూ.. మిగతా రేట్లు చూస్తే..!!

బయట10రూ”పునుగులు.. నమ్రత హోటల్లో 125 రూ.. మిగతా రేట్లు చూస్తే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారు ఉండరు.. ఆయన ఇప్పటికే సినిమాల్లో దూసుకుపోతున్నారు. సినిమాలు చేస్తూ మరోవైపు యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అలాంటి మహేష్ బాబు సినిమాలు,యాడ్స్ కాకుండా బిజినెస్ రంగంలో కూడా ఎప్పుడో అడుగు పెట్టారు.. ఇప్పటికే ఆయనకున్న ఏషియన్ సినిమాస్ వ్యాపార రంగంలో దూసుకుపోతోంది. దీనికి తోడు మరో బిజినెస్ లోకి మహేష్ బాబు దంపతులు అడుగుపెట్టారు.ఆయన సినిమా రంగంలో దూసుకుపోతూ ఉంటే, సతీమణి నమ్రత మాత్రం బిజినెస్ లలో దూసుకుపోతోంది..

Advertisement

also read:క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్, విశాఖలో టీమిండియా మ్యాచ్‌లు

Advertisement

అయితే తాజాగా వీరు ఓపెన్ చేసిన మినర్వా కాఫీ షాప్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఏషియన్ సినిమాస్ సునీల్ భాగస్వామ్యులుగా ఈ ఫుడ్ రంగంలోకి అడుగు పెట్టారట. తాజాగా పూజా కార్యక్రమంలో పాల్గొని హోటల్ ప్రారంభించారు నమ్రత.. ఈ తరుణంలో హోటల్ లోని కొన్ని ఫుడ్ ఐటమ్స్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ముఖ్యంగా ఈ హోటల్ ను జూబ్లీహిల్స్ లాంటి హై ఏరియాలో స్థాపించడం వల్ల అక్కడ నివసించే వారి రేంజ్ కు తగ్గట్లు రేట్లు ఉన్నాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.. మరికొంతమంది సాధారణ వ్యక్తులు ఈ హోటల్లో తినలేరంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఇంతకీ రేట్లు ఎలా ఉన్నాయంటే రెగ్యులర్ టిఫిన్స్ లో ఇడ్లీ 90 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఉంది..

ఇక స్నాక్స్ విషయానికి వస్తే ఆలు బజ్జి, మిర్చి, పునుగులు ఏదైనా 125 రూపాయల పైకే రేటు ఉంది.. అయితే సాధారణంగా పునుగులు బయట హోటల్లో తింటే పది రూపాయల నుంచి 25 రూపాయల వరకు ధర ఉంటుంది.. కానీ నమ్రత హోటల్లో మాత్రం ఏకంగా 125 రూపాయల ధర ఉండడం అందరినీ షాక్ కు గురిచేస్తుంది.. ఏది ఏమైనా ప్రస్తుతం నమ్రత హోటల్ కు సంబంధించి ఫుడ్ ఐటమ్స్ రేట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారడంతో.. చాలామంది వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.. మరి ఈ రేట్లపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..

also read:

Visitors Are Also Reading