Home » ఎన్టీఆర్ కృష్ణ మ‌ధ్య గొడ‌వ‌లపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసిన మ‌హేశ్..!

ఎన్టీఆర్ కృష్ణ మ‌ధ్య గొడ‌వ‌లపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసిన మ‌హేశ్..!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బికే టాక్ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ టాక్ షో కు టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు దర్శకులు వస్తున్నారు. ఈ టాక్ షో ద్వారా బాలయ్య కు మాత్రమే కాకుండా ఆహాకు కూడా ఎంతో గుర్తింపు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ షోకు గెస్ట్ గా మహేష్ బాబు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా మహేష్ బాబు బాలయ్య ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే మహేష్ బాబు తో బాలయ్య ఎంతో సరదాగా మాట్లాడించారు. మీ నాన్న గారు పంచ్ లు బాగా వేస్తారు…మీకు కూడా ఆ టాలెంట్ వచ్చిందంట కదా అంటూ బాలయ్య అన్నారు.

Balayya

Balayya

దాంతో మహేష్ బాబు అవును కానీ టైమింగ్ ఉండదు అంటూ కామెంట్ చేశారు. దాంతో టైమింగ్ ఇప్పటి నుండి వస్తుంది అని బాలయ్య వ్యాఖ్యానించారు. ఇక ఇదే టాక్ షోలో సీనియర్ ఎన్టీఆర్ సూప‌ర్ స్టార్ కృష్ణ మధ్య గొడ‌వ‌ల గురించి ఇద్ద‌రు వార‌సులు చ‌ర్చించారు. కొద్ది సంవత్సరాల పాటు ఎన్టీఆర్ కృష్ణ మ‌ధ్య‌ గొడవలు ఉన్నాయని ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండేదని వార్తలు వినిపిస్తుంటాయి. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ కొన్ని సినిమాలు కూడా చేశారని వార్తలు వినిపించేవి. అంతేకాకుండా ఎన్టీఆర్ ను టార్గెట్ గా ముఖ్యమంత్రి పీఠంపై కూడా కృష్ణ సెటైర్లు వేశారని వార్తలు వినిపించేవి.

Advertisement

Advertisement

ఈ గొడవలకు కారణం అల్లూరి సీతారామరాజు సినిమా అని ఈ సినిమాను మొదట ఎన్టీఆర్ చేయాలని అనుకోగా కృష్ణ‌ చేశారని అందువల్లే గొడవలు వచ్చాయని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు సినిమా చూసి తన కంటే గొప్పగా చేశావని కృష్ణను మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా టాక్ షోలో మహేష్ బాబు వెల్లడించారు.

అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో నాన్నగారికి ఎన్టీఆర్ తో గొడవ లు ఉన్నాయనే వార్తలు అబద్ధమని అన్నారు. ఆ సినిమా చూసిన తర్వాత ఒకవేళ నేను చేసినా కూడా ఇంత బాగా నటించలేనని ఎన్టీఆర్ గారు నాన్నను మెచ్చుకున్నారు. అని మహేష్ బాబు గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆ మాట విన్న ప్రతిసారి నాన్నలో ఏదో తెలియని గర్వం ఉండేదని అంతేగాని ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని మహేష్ బాబు ఆ వార్తలను కొట్టిపారేశారు.

Visitors Are Also Reading