Home » కమలహాసన్ గురించి నేను మాట్లాడను అంటున్న మహేష్..!

కమలహాసన్ గురించి నేను మాట్లాడను అంటున్న మహేష్..!

by Azhar
Ad

లోకనాయకుడు కమలహాసన్ గురించి ఎవ్వరికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి పాన్ ఇండియా హీరో అని ఈయనకు ఇంకో పేరు కూడా ఉంది. అయితే కమలహాసన్ సినిమాలు అంటే జనాలు ఎంతలా ఇష్టపడతారో అందరికి తెలుసు. కానీ గత ఐదేళ్లుగా కమలహాసన్ నుండి ఎటువంటి సినిమా అనేది రాలేదు. అందుకు కారణం కమలహాసన్ తమిళనాడు రాజకీయాలోకి ఎంట్రీ ఇవ్వడమే. అక్కడ పార్టీ పనులతో బిజీగా ఉన్న అఆయన ఇన్ని రోజులు సినిమా తీయలేదు.

Advertisement

కానీ అక్కడ రాజకీయాల నుండి ఆయన కొంత గ్యాప్ రావడంతో సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నారు. ఇది ఆయనకు ఎంతో ముఖ్యం. అందుకే తానే నిర్మాతగా… లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ మధ్యనే పాన్ ఇండియా సినిమాగా జన్మ ముందుకు వచ్చిన ఈ విక్రమ్… జనాలను ఆకట్టుకుంది. విడుదలైన ప్రతి చోట సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో చివర్లో సింగం సూర్య ఎంట్రీ ఇవ్వడం అనేది సినిమాకే హైలెట్ అని చెప్పాలి. చివరి ఐదు నిమిషాలు సూర్య థియేటర్ లో రచ్చ లేపాడు అని కమల్ కూడా అన్నాడు.

Advertisement

అయితే కమలహాసన్ కు చాలా మంది హీరోలు కూడా అభిమానులే. అందులో మం ఆతెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడు. అయితే తాజాగా విక్రమ్ సినిమా గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. సినిమా అంద్భుతంగా ఉంది. నేను లోకేష్ కనకరాజుతో మాట్లాడుతా.. ఇలాంటి సినిమా ఎలా తీశారు అని మహేష్ చెప్పాడు. ఇక కమలహాసన్ నటన గురించి నేను మాట్లాడలేను. ఆయన అభిమాని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మహేష్ బాబు చెప్పాడు. ఇక కమల్ గురించి మహేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

పంత్ వల్ల కాదు.. మొత్తం ఇంగ్లాండ్ బౌలర్లదే…!

బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకముందు ఏం జరిగిందో చెప్పిన ద్రావిడ్..!

Visitors Are Also Reading