మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ నిర్మించారు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కు మగధీర రెండో సినిమా కాగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చరణ్ కు జోడీగా నటించింది. ఇక ఈ సినిమా చాలా థియేటర్ లలో వందరోజులు ఆడింది.
అయితే నిజానికి చిరుత సినిమా కంటే ముందే జక్కన్నకు చరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. చిరంజీవి అల్లు అరవింద్ కలిసి రామ్ చరణ్ ను లాంచ్ చేయాలని ఆ బాధ్యతలు రాజమౌళి చేతిలో పెట్టారు. కానీ రాజమౌళి రెండో సినిమా చేస్తానని చెప్పారు. ఆ తరవాత ఆ ఛాన్స్ పూరి జగన్నాత్ చేతిలోకి వెళ్లింది. అలా వచ్చిన చిరుత హిట్ గా నిలిచింది. ఆ తరవతే జక్కన్న మగధీర సినిమా చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
మగధీర సినిమాకు కథను దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కథను విజయేంద్ర ప్రసాద్ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా చేయాలని అనుకున్నారు. కృష్ణ హీరోగా జగదేకవీరుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను ఇవ్వాల్సి ఉంది. కథ పూర్తిచేసుకుని దర్శకనిర్మాతలకు వినిపించాడు.
కానీ వాళ్లకు నచ్చలేదు. దాంతో కొత్త రచయితను తీసుకున్నారు. ఆ కథను రాజమౌళి కూడా విన్నాడు. అప్పుడే ఈ కథతో సినిమా చేయాలని నిర్నయించుకున్నాడు. ఇక అదే కథను చిరంజీవి అల్లు అరవింద్ లకు వినిపించగా ఇంప్రెస్ అయిపోయారు. అలా కృష్ణ కోసం అనుకున్న కథతో జక్కన్న చరణ్ తో సినిమా చేసి స్టార్ గా నిలబెట్టాడు.
also read : ఆ టాలీవుడ్ నిర్మాతతో శ్రీరెడ్డి వివాహం..?