Home » ఏపీ సీఎం జ‌గ‌న్‌కు నారా లోకేష్ లేఖ.. ఎందుకంటే..?

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు నారా లోకేష్ లేఖ.. ఎందుకంటే..?

by Anji
Ad

ఏపీ రాష్ట్ర సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి నారా లోకేష్ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వ‌చ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తికి ప్ర‌భుత్వం భ‌రోసా ఇవ్వాలంటూ సీఎం జ‌గ‌న్ కు లోకేష్ లేఖ రాశారు. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం తీవ్ర‌మైన త‌రుణంలో ఉక్రెయిన్ లో చ‌దువుతున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాల‌కు చేరుకున్నార‌ని వెల్ల‌డించారు.

Advertisement

Advertisement

వ‌చ్చిన విద్యార్థుల‌లో కొంత మందికి ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో త‌ర‌గ‌తుల‌ను ప్రారంభించ‌గా.. తాము చ‌దివే వ‌ర్సిటీ నుంచి ఎటువంటి స‌మాచారం లేక మ‌రికొంద‌రూ అయోమ‌యంలో ఉన్నారని ఫైర్ అయ్యారు. త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాలు విద్యార్థుల కోర్సులు పూర్తికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆర్థికంగా అయ్యే ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఏపీ ప్ర‌భుత్వం కూడా విద్యార్థులు చ‌దువు పూర్త‌య్యే బాధ్య‌త‌ను తీసుకోవాల‌ని కోరుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్‌. అసెంబ్లీ సాక్షిగా క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌ను స‌హ‌జ మ‌ర‌ణాలుగా చిత్రీక‌రించి సీఎం స‌భ‌ను ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఫైర్ అయ్యారు.

Also Read :  ర‌వితేజ వ‌ల్ల టాలీవుడ్ ను ఏలుతున్న 5గురు స్టార్ డైరెక్ట‌ర్లు వీళ్లే..!

Visitors Are Also Reading