Home » Laxmi parvathi:బాలకృష్ణకు దమ్ముంటే అన్ స్టాఫబుల్ కు నన్ను పిలవాలి.. చేదు నిజాలు బయటపెడతా..?

Laxmi parvathi:బాలకృష్ణకు దమ్ముంటే అన్ స్టాఫబుల్ కు నన్ను పిలవాలి.. చేదు నిజాలు బయటపెడతా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

నందమూరి ఫ్యామిలీని ఎప్పుడు ఏదో ఒక మ్యాటర్ లో వార్తల్లో నిలుపుతుంది సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి.. నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు కూడా లక్ష్మీపార్వతిని వారి సొంత మనిషి లాగా చూడలేదు. కానీ లక్ష్మీపార్వతి మాత్రం ఆ ఫ్యామిలీ గురించి నారా చంద్రబాబునాయుడు గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని బయట పెడుతూ వార్తల్లోకెక్కుతుంది.. సీనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన చేదు నిజాలు నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉంటుంది. నేను, సీనియర్ ఎన్టీఆర్ నిజాలు మాట్లాడుతూ బ్రతికామని కామెంట్లు చేస్తుంది.

also read:కరివేపాకు రసంతో అద్భుతమైన ప్రయోజనాలు.. తీసుకోకుంటే వారు నష్టపోయినట్టే..!

Advertisement

నందమూరి కుటుంబంలో చోటు చేసుకుంటున్న విషాదాలు నన్ను ఎంతో బాధ పెడుతున్నాయని పేర్కొంటుంది. తారక రత్న విషయంలో మెజారిటీ ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆస్పత్రి బిల్లులను విజయసాయిరెడ్డి పే చేశారని ఆమె అన్నారు. తారకరత్న పిల్లలకు న్యాయం చేస్తే బాగుంటుందని లక్ష్మీపార్వతి తెలియజేశారు. మోహన కృష్ణ కుటుంబంతో నాకు మాటలు లేవని ఆమె తెలియజేశారు. వ్యక్తిగతంగా మోహనకృష్ణ మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు లక్ష్మీపార్వతి. సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన టైంలోనే ఆస్తులను పిల్లల పేర్ల పై రాసేసారని, లోకేష్ అల్ప జంతువు అని ప్రజలందరూ వాస్తవాలు గ్రహిస్తున్నారని లక్ష్మి పార్వతి వెల్లడించారు.

Advertisement

also read:మా నాన్న కంటే భార్యకే ఎక్కువ భయపడతా…వైరల్ అవుతున్న మంచు విష్ణు కామెంట్స్…!

జూనియర్ ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని అన్నారు. ముఖ్యంగా జనసేనకు రూపకర్త చంద్రబాబు అని లక్ష్మీపార్వతి తెలియజేశారు. అన్ స్టాపబుల్ షోకు పిలిస్తే వెళ్తారా అనే ప్రశ్నకు కచ్చితంగా వెళ్తాను లక్ష్మీపార్వతి అన్నారు. బాలకృష్ణ ధైర్యం చేసి పిలిస్తే ఏం జరిగిందో సాక్షాలతో సహా నేను చెబుతానని కానీ బాలయ్యకు పిలిచే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:

Visitors Are Also Reading