Home » ప్రియుడి మోజులో భ‌ర్త పిల్ల‌ల‌ను విడిచి ఇంటి నుండి పారిపోయిన మ‌హిళ‌..? క‌ట్ చేస్తే చివ‌రికి అలా..!

ప్రియుడి మోజులో భ‌ర్త పిల్ల‌ల‌ను విడిచి ఇంటి నుండి పారిపోయిన మ‌హిళ‌..? క‌ట్ చేస్తే చివ‌రికి అలా..!

by AJAY
Ad

అక్ర‌మ‌సంబంధాలు కాపురాల‌ను కూల్చేస్తున్నాయి. ప‌చ్చ‌ని కాపురాల్లో మంటపెడుతున్నాయి. భ‌ర్త‌భార్య ఇద్ద‌రిలో త‌ప్పు ఎవ‌రు చేసినా శిక్ష‌మొత్తం ఆ కుటుంబం అనుభవించాల్సి వ‌స్తుంది. ప్రేమించినవారి మోజులో ప‌డి క‌ట్టుకున్న‌వాళ్ల‌నే కాకుండా క‌న్న‌వారిని సైతం మర్చిపోతున్న ఘ‌ట‌న‌లు త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం. అక్ర‌మ‌సంబంధాల వ‌ల్ల ప్రాణాలు కోల్పోతున్నవాళ్లను కూడా చూస్తూనే ఉన్నాం.

Advertisement

తాజాగా త‌మిళ‌నాడులోనూ అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని తిరువ‌ళ్లూరు జిల్లా చోళ‌వ‌రం గ్రామానికి చెందిన బాబు, ఆముద భార్యా భ‌ర్త‌లు వీరిద్ద‌రికి ఓ కూతురు కుమారుడు జ‌న్మించారు. అక్క‌డి వ‌ర‌కూ వీళ్ల కాపురం సాఫీగా సాగిపోతోంది. అయితే అలాంటి కాపురంలోకి ఓ మూడో వ్య‌క్తి ప్ర‌వేశించాడు. అదే గ్రామానికి చెందిన జ‌గ‌దీశ్ అనే వ్య‌క్తితో ఆముద వివాహేత‌ర సంబంధాన్ని పెట్టుకుంది. చాలా కాలం పాటూ వీరి వ్య‌వ‌హారం గుట్టుగానే సాగింది. కానీ ఆముద భ‌ర్త బాబుకు ఈ విష‌యం తెలియ‌డంతో ఇంట్లో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలో ఆముద భ‌ర్త పిల్లల‌ను విడిచిపెట్టి ప్రియుడు జ‌గ‌దీశ్ తో క‌లిసి ఇంటినుండి పారిపోయింది.

Advertisement

దాంతో ఆమె త‌ల్లి దండ్రులు జ‌ల్లెడ ప‌ట్టి వెతికి మ‌రీ తీసుకుచ్చారు. మ‌రోసారి త‌మ అల్లుడికి అప్ప‌జెప్పారు. ఇక‌నైనా బుద్దిగా ఉండ‌మ‌ని స‌ర్దిచెప్పారు. కానీ ఆముద ప్ర‌వ‌ర్త‌న‌లో మాత్రం మార్పురాలేదు. మ‌రోసారి ప్రియుడు జ‌గ‌దీష్ తో క‌లిసి క‌ట్టుకున్న‌వాడిని క‌న్న‌బిడ్డ‌ల‌ను విడిచిపెట్టి ఇంటి నుండి పారిపోయింది. ఇంటి నుండి పారిపోయిన 20 రోజుల‌కు ఆముద తిరువ‌ళ్లూరు మ‌న్సిపాలిటీ ప‌రిధిలో శ‌వ‌మైతేలింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

Visitors Are Also Reading