సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లుగా రానించినవారిలో కుష్బూ కూడా ఒకరు. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కుష్భు ఆతరవాత తెలుగులోనూ సినిమాలు చేసింది. ఇక్కడ కూడా సూపర్ హిట్ లు అందుకుంది. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ టీవీ షోలలో సందడి చేస్తోంది. అంతే కాకుండా కుష్భూ రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తోంది.
ALSO READ : Shruti Haasan : హీరోల వయసుతో పనిలేదు… ఎవరైనా ఓకే అంటున్న శృతిహాసన్
Advertisement
ఇక కుష్భూ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తమిళ దర్శకనిర్మాత సుందర్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే కుష్బూ కు సుందర్ తో పెళ్లి జరగకముందే మరో నటుడితో వివాహం జరిగింది అన్న సంగతి చాలా మందికి తెలియదు. డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా నటించిన నటుడు ప్రభు చాలా మందికి పరిచయమే.
Advertisement
ప్రభు చంద్రముఖి సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కాగా ప్రభు ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేశాడు. జెమిని గణేషన్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి అప్పట్లో హీరోగా రానించాడు. అదే సమయంలో కుష్బూ కూడా హీరోయిన్ గా బిజీగా ఉండేవారు. కాగా ప్రభుతో కుష్బూ కలిసి ఓ సినిమాలో నటించారు.
ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఆ తరవాత పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పటికే మరో మహిళతో ప్రభుకు పెళ్లైపోయింది. దాంతో కుష్భూను వివాహం జరిగిన తరవాత గొడవలు మొదలయ్యాయి. ప్రభు భార్య వీరి పెళ్లికి అభ్యంతరం తెలిపింది. దాంతో కుష్భూ ప్రభు దూరమయ్యారు. అంతే కాకుండా ఆ తరవత 2000 సంవత్సరంలో కుష్భూ సుందర్ ను వివాహం చేసుకుని ఆయన పేరును తన పేరు చివరణ చేర్చుకుంది.