Home » మేము ఇన్నింగ్స్ ఆడలేం అనుకున్నారు.. అందుకే ఆడుతున్నారు..!

మేము ఇన్నింగ్స్ ఆడలేం అనుకున్నారు.. అందుకే ఆడుతున్నారు..!

by Azhar
Ad
ఐపీఎల్ 2022 మెగవేలం తర్వాత అత్యంత బలహీన జట్లుగా ముద్ర వేసుకున్నాయి గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్. ఈ రెండు జట్లే పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉంటాయి అని చాలా మంది చెప్పారు. కానీ లీగ్ దశ తర్వాత ఈ రెండు జట్లే మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇందులో రాజస్థాన్ కెప్టెన్ సంజు పై విమర్శలు వచ్చాయి. సంజు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేవు అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయాలే జట్టును ఓడిస్తున్నాయి అన్నారు.
కానీ వాటిని లెక్క చేయకుండా ఇప్పుడు రాజస్థాన్ జట్టును ఫైనల్స్ కు చేర్చాడు సంజూ. ఐపీఎల్ మొదటి సీజన్ తర్వాత రాజస్థాన్ ఫైనల్స్ కు వెళ్లడం మళ్ళీ ఇదే. అయితే తాజాగా సంజూ కెప్టెన్సీ గురించి ఆ జట్టు హెడ్ కోచ్ కుమార్ సంగర్కర మాట్లాడాడు. సంగర్కర మాట్లాడుతూ… సంజూ చిన్న వయస్సులోనే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. అయిన అతను జట్టును బాగా నడిపించాడు. సంజూ జట్టులో ప్రతి ఆటగాని మీద నమ్మకం ఉంచుతాడు. అందువల్లే ఆటగాళ్లు అందరూ కూడా కెప్టెన్ గా సంజూని నమ్ముతారు
అయితే బ్యాటర్, కీపర్ , కెప్టెన్ ఇలా మూడింట్లో రాణించడం కష్టం. కానీ ఇప్పుడు జట్టులో బట్లర్ తర్వాత సంజూనే బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ప్రతి మ్యాచ్ లో అద్భుతాలు చేయలేము అని సంజూ తెలుసుకున్నాడు. బట్లర్ కూడా ఈ విషయాన్ని గ్రహించాడు. అందుకే వీరిద్దరి మంచి సమానవ్యయం కుదురింది. గౌండ్ లో అది బాగా కనిపిస్తుంది అని సంగర్కర అన్నారు. అయితే రేపు జరగనున్న ఫైనల్స్ లో సంజూ హాట్ గుజరాత్ ను ఓడించి టైటిల్ అందుకోగలదా అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading