Home » ఏపీలో కేటీఆర్ క్రేజ్….. సీఎం కావాలంటూ గుంటూరు అభిమాని బైక్ యాత్ర…!

ఏపీలో కేటీఆర్ క్రేజ్….. సీఎం కావాలంటూ గుంటూరు అభిమాని బైక్ యాత్ర…!

by AJAY
Ad

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు యూత్ లో ఎక్క‌వ ఫాలోయింగ్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హైద‌రాబాద్ కు విచ్చేసిన సంధ‌ర్బంగా కేటీఆర్ త‌న ఇంగ్లీష్ తో అంద‌ర్నీ అవాక్క‌య్యేలా చేశారు. ప్ర‌స్తుతం ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎన్నో కొత్త ఆలోచ‌నలు కూడా చేస్తున్నారు.

Advertisement

Advertisement

కేవ‌లం హైద‌రాబాద్ లోనే కాకుండా ఇతర జిల్లాలో కూడా ఐటీ హ‌బ్ ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక కేటీఆర్ కు తెలంగాణ‌లోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌లోనే కూడా అభిమానులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన ఓ అభిమాని కేటీఆర్ సీఎం కావాలంటూ బైక్ యాత్ర‌ను ప్రారంభించాడు. బైక్ యాత్ర మొద‌లు పెట్టిన అభిమాని గుంటూరు జిల్లా మాచ‌ర్లకు చెందిన బాల‌రాజు గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ ను సీఎంగా చూడాల‌నే కోరిక‌తో వినూత్నంగా ఏదైనా చేయాల‌ని అనుకున్న‌ట్టు తెలిపారు.

ఈ నేప‌థ్యంలోనే తాను బైక్ యాత్ర‌ను మొద‌లు పెట్టిన‌ట్టు తెలిపాడు. ఇక మాచ‌ర్ల‌లో బైక్ యాత్ర‌ను మొద‌లు పెట్టిన బాల‌రాజు గౌడ్ యాదాద్రికి చేరుకున్న సంధ‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఫోటో ప్లెక్లీల‌ను త‌న బైక్ కు అమ‌ర్చుకున్నాడు. అంతే కాకుండా యాదాద్రిలో కేటీఆర్ పేరిట యాదాద్రిలో పూజ‌లు చేయించాడు.

Visitors Are Also Reading