Home » కృష్ణ ఆహార అలవాట్లు.. చనిపోయే ముందు ఏం తిన్నారంటే..?

కృష్ణ ఆహార అలవాట్లు.. చనిపోయే ముందు ఏం తిన్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలోనే రికార్డు హిట్లు సాధించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం చాలా బాధాకరం. ఆయన మరణం వారి కుటుంబాన్ని కాకుండా ఎంతో మంది ఫ్యాన్సును శోక సంద్రంలో ముంచింది. అలాంటి కృష్ణ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండేవో మనం ఇప్పుడు చూద్దాం.. సూపర్ స్టార్ కృష్ణ ఎంత హ్యాండ్సమ్ గా ఉండేవారో అందరికీ తెలుసు. ఆయన మొదటి భార్య చనిపోయిన సమయంలో కూడా కృష్ణ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉన్నారు.

Advertisement

Also read;రవి తేజ కిక్ సినిమా ని చేతులారా వదులుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే ?

దీనికి ప్రధాన కారణం ఆయన ఆహారపు అలవాట్లేనని రచయిత తోటపల్లి మధు కృష్ణ అన్నారు. అలాంటి ఫుడ్ నేటి తరం వారు తినలేక పోతున్నారని గుర్తు చేసుకున్నారు. గూడచారి 116 సినిమాలో పనిచేసిన రచయిత మధు కృష్ణ.. కృష్ణ ఉదయం ఇంటి నుండి షూటింగ్ కు బయలుదేరే సమయంలో హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినేవారని, ఆ తర్వాత 11 గంటలకు పెరుగు వడ మాత్రమే తినేవారని, టీ, కాఫీలు అస్సలు ఇష్టపడే వారు కాదని అన్నారు. ఉదయం లేవగానే రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగేవారని మరోసారి గుర్తు చేశారు.

Advertisement

అంతేకాకుండా మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం తప్పకుండా తినేవారని, ఆ తర్వాత కొద్దిసేపు పడుకొని సాయంత్రం ఐదు గంటలకు గోధుమ రవ్వతో చేసిన దోషలను ఇష్టంగా తినే వారని, మరీ ముఖ్యంగా మనీ హోటల్లో వేసిన గోధుమ రవ్వ దోష అంటే సూపర్ స్టార్ కృష్ణకు చాలా ఇష్టం ఉండేదట. షుటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా ఫుడ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా తినేవారట. షూటింగ్ లేని సమయంలో ఇంట్లో ఉన్నా కానీ ఇదే ఫుడ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారట. ఆహారం తిన్న తర్వాత 20 మినిట్స్ వాకింగ్ చేయడం ఆయనకు ఉన్న అలవాటట. ఈ విధంగా ఆయన ఆరోగ్యం గురించి ఎంతో కేరింగ్ గా ఉన్నా చివరికి అనారోగ్యం క్షీణించి ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం.

Also read;కృష్ణ అంత్యక్రియల విషయం లో మహేష్ బాబు తప్పు చేశాడా…?

Visitors Are Also Reading