Home » ‘జనతా గ్యారేజ్ లో బాలయ్య ని కాదని మోహన్ లాల్ ని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా ?

‘జనతా గ్యారేజ్ లో బాలయ్య ని కాదని మోహన్ లాల్ ని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా ?

by Venkatesh

కొరటాల శివతో స్టార్ హీరోల సినిమా అంటే చాలు ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మిర్చి సినిమా తర్వాత ఆయన రేంజ్ ఒక రేంజ్ లో పెరిగింది అనే మాట వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన చేసిన జనతా గ్యారేజ్ సినిమా అయితే సూపర్ హిట్ అయింది. కమర్షియల్ గా కూడా నిర్మాణ సంస్థకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది అనే మాట వాస్తవం.

ఇప్పుడు కొరటాల శివ స్టార్ డైరెక్టర్ గా వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెట్టారు. అయితే జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కు పెదనాన్నగా బాలకృష్ణను తీసుకుంటే బాగుండేది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆయన మాత్రం ఆ కాంబో ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పారు. మోహన్ లాల్ ను అందరూ కమర్షియల్ గా ఎంపిక చేసారని భావించినా ఆయన మాత్రం కాదని కొట్టిపారేశారు.

Also Read: మంచు విష్ణు హెయిర్ స్టైలిష్ట్ పై నాగ‌బాబు పొగ‌డ్త‌ల వ‌ర్షం..!

Koratala Siva - Wikipedia

ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. ఒక సహజ నటుడు కావాలనే ఆలోచనలో భాగంగానే ఆ పవర్ ఫుల్ పాత్రకు ఆయన్ను ఎంపిక చేసామని, ఎన్టీఆర్ రేంజ్ కు మోహన్ లాల్ అయితే బాగుంటుంది అనే ఆలోచనతోనే ఆ అడుగు వేసినట్టుగా చెప్పారు. బాలకృష్ణను తీసుకుంటే ప్రేక్షకులు సినిమా కథ వదిలేసి బాబాయి, అబ్బాయిలను చూస్తారని అది చాలా పవర్ ఫుల్ కాంబినేషన్ కాబట్టే తాను ఆ అడుగు వేయలేదు అన్నారు. దానికి ఇంకా బలమైన కథ కావాలనే కొరటాల శివ స్పష్టం చేసారు.

Also Read: యూట్యూబ్ పేమెంట్స్ ఇంత దారుణంగా ఉంటాయా…?

Visitors Are Also Reading