Home » మ‌ద్యం తాగుతూనే క‌థ‌లు రాస్తా అంటున్న ఆ స్టార్ డైరెక్ట‌ర్‌..!

మ‌ద్యం తాగుతూనే క‌థ‌లు రాస్తా అంటున్న ఆ స్టార్ డైరెక్ట‌ర్‌..!

by Anji

షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అత‌ను అగ్ర‌ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేర్గాంచారు. షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్ట‌ర్ అని పిలుస్తుంటారు. ముఖ్యంగా ప్ర‌శాంత్‌నీల్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది.


ముఖ్యంగా క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా ఆయ‌న తెర‌కెక్కించిన కేజీఎఫ్ చాఫ్ట‌ర్ -1 సృష్టించిన సంచ‌ల‌నాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తాజాగా కేజీఎప్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ వ‌రుస ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా పంచుకున్నాడు. ముఖ్యంగా తాను మ‌ద్యం సేవిస్తాను అని.. తాగుతూనే క‌థ‌లు రాస్తుంటాను అని తెలిపాడు. మ‌త్తులో ఉన్న‌ప్పుడు కూడా సినిమాలో స‌న్నివేశాల గురించి ఆలోచిస్తాన‌ని చెప్పాడు. ఏమేమి ఆలోచిస్తానంటే.. సినిమాలో ఈ సీన్ ఎందుకు..? ఇది సినిమాకు అవ‌స‌ర‌మా..? లేదా..? అని ఒక‌టికి ప‌దిసార్లుఆలోచిస్తుంటాను అని చెప్పాడు. క‌థ ముఖ్యం కాద‌ని.. దాన్ని ఎలా ప్రెజెంట్ చేశామ‌న్న‌దే ఇంపార్టెంట్ అని తెలిపాడు. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

  1. విమానాల‌కు తెలుపు రంగు మాత్ర‌మే ఎందుకు వేస్తారో తెలుసా..?
  2. రాజమౌళి కారును చూసారా.. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
  3. 13 ఏండ్ల కరువు : ఆ దేశ రాజధానిలో విద్యుత్ కోతల లాగే.. వాటర్ కోతలు..!!
Visitors Are Also Reading